AP COVID Cases : ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు - అత్యధికంగా ఈ జిల్లాలోనే…!
Andhra Pradesh COVID Cases : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆ సంఖ్య 19కి చేరింది. ఇటీవలే కొత్త వేరియంట్ నిర్ధారణ కావటంతో వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది.
Andhra Pradesh COVID Cases : ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ వ్యాప్తి మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా కేసులు నమోదుకావడంతో ఆరోగ్య శాఖ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. ఇందులో అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలోనే 8 కేసులున్నాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసులు
కడప జిల్లా తర్వాత గుంటూరు, కాకినాడ జిల్లాల్లో రెండేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. అలాగే పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున బయటపడ్డాయి.
ఇప్పటివరకు వైరస్ మరియు ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల కారణంగా నలుగురు మరణించారు. ఇక ముగ్గురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా…. మరో నలుగురు హోం ఐసోలేషన్లో ఉంటూ కోలుకుంటున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన బాధితుల నమూనాలను అధికారులు పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) పరిశోధన కేంద్రానికి పంపించారు. ఈ నమూనాలను తీవ్రంగా పరిశీలించిన నిపుణులు…. ఇది 'ఆర్ఎఫ్.5' వేరియంట్ అని ఇటీవలనే నిర్ధారించారు. ఇక రాష్ట్రవ్యాప్త పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సర్వైలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది.
'ఆర్ఎఫ్.5' కొత్త వేరియంట్ ఏంటి?
వైరస్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవిడ్-2 వైరస్ కాలక్రమంలో పరిణామం చెందుతూ ఒమిక్రాన్గా రూపాంతరం చెందింది. ఈ ఒమిక్రాన్ ఉపరకమైన 'జేఎన్.1' నుంచి 'ఎల్ఎఫ్.7', 'పీవై.1.1.1' అనే రెండు వేర్వేరు బ్రాంచిలు ఏర్పడ్డాయి. ఈ రెండింటి కలయికతోనే తాజాగా 'ఆర్ఎఫ్.5' అనే కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది.
ఈ 'ఆర్ఎఫ్.5' వేరియంట్ను చూసి ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాకపోతే…. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, ఏడాదిలోపు చిన్న పిల్లలు, గర్భిణులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా ఆర్ఎఫ్.5 ప్రధాన లక్షణాలు
- నిరంతర దగ్గు, జలుబు
- గొంతునొప్పి, తలనొప్పి
- తీవ్రమైన ఒళ్లు నొప్పులు
- గ్రేడ్ ఫీవర్ (జ్వరం)
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా కొన్ని నియమాలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఆ వివరాలు ఇలా….
- రద్దీగా ఉండే ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
- హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్తో చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- కరోనా లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లి, వైద్యుల పర్యవేక్షణలో ఉండటం శ్రేయస్కరం.
- పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి లక్షణాలు కనిపిస్తే వెంటనే హోం ఐసోలేషన్లో ఉండి విశ్రాంతి తీసుకోవాలి.
- మూడు నాలుగు రోజుల్లో సమస్య తగ్గకపోతే వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

