Visakhapatnam CII Summit 2026 : రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కురిపించడమే కాకుండా, నూతన ఆలోచనలకు, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలిచేలా ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సును నిర్వహించడానికి ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖపట్నంలో 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సును అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గతానికి భిన్నంగా, సరికొత్త వ్యూహాలతో ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సన్నాహక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది సదస్సును "Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World" అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా వివిధ దేశాలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ సమావేశాలు, కంట్రీ సెషన్స్తో పాటు బిజినెస్ టు బిజినెస్ (B2B), బిజినెస్ టు గవర్నమెంట్ (B2G) భేటీలు జరిగేలా పక్కా ప్రణాళికలతో ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
5 నగరాల్లో ప్రాంతీయ సదస్సులు….
విశాఖలో జరిగే ప్రధాన సదస్సుకు ముందే రాష్ట్రంలోని ఐదు ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ఈ ప్రాంతీయ సదస్సులు జరుగుతాయి. ఆయా ప్రాంతాల్లో ఏయే రంగాల పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన అవకాశాలు ఉన్నాయో ముందుగానే బేరీజు వేసి, దానికి అనుగుణంగా అక్కడికక్కడే ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఈ సదస్సుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ లలో భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. అలాగే విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయాలని చంద్రబాబు సూచించారు.
{{/usCountry}}ఈ సదస్సుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ప్రముఖ నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ లలో భారీ రోడ్ షోలు నిర్వహించనున్నారు. అలాగే విదేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాయాలని చంద్రబాబు సూచించారు.
{{/usCountry}}రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఈ సదస్సులో 'రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రాంతీయ సదస్సులలో సరికొత్త స్టార్టప్ కంపెనీలకు, సరికొత్త ఆలోచనలతో వచ్చే యువతకు అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు. ఈ సదస్సుల్లో నేటి తరం యువత (Gen Z) భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.