విద్యార్థులకు అలర్ట్.. ఆంధ్ర యూనివర్సిటీ బీబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అడ్మిషన్ల గడువు పొడిగింపు
విద్యార్థులకు ఆంధ్ర యూనివర్సిటీ కీలక అప్డేట్ ఇచ్చింది. బీబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అడ్మిషన్ల గడువు పొడిగించింది.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ఏయూ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల నుండి వచ్చిన నిరంతర అభ్యర్థనలు, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న ప్రతిష్టాత్మక కోర్సులైన మూడేళ్ల బీబీఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీబీఏ-ఎంబీఏ (Integrated BBA-MBA) ప్రోగ్రాములలో చేరడానికి ఆఫ్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్హులైన అభ్యర్థులు ఇప్పుడు జూలై 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఈ మేరకు ఆంధ్ర యూనివర్సిటీ అడ్మిషన్ల డైరెక్టర్ ప్రొఫెసర్ డి.ఎ. నాయుడు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన జాతీయ విద్యా విధానం - 2020 (NEP 2020) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కోర్సులు రూపుదిద్దుకున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కోర్సులలో విద్యార్థుల సౌకర్యార్థం 'మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్' విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అంటే విద్యార్థులు తమ వీలును బట్టి కోర్సు మధ్యలో విరామం తీసుకోవడానికి లేదా తిరిగి చేరడానికి ఇందులో వీలుంటుంది.
ముఖ్యమైన తేదీల వివరాలు
ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఏయూ అధికారులు ఈ కింది విధంగా ప్రకటించారు. ఆఫ్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ జూలై 15గా ఉంది. గ్రూప్ డిస్కషన్స్, పర్సనల్ ఇంటర్వ్యూలు జూలై 21, జూలై 23 తేదీలలో నిర్వహిస్తారు. జూలై 25న సీట్లను కేటాయిస్తారు. కోర్సు ఫీజు చెల్లింపుల ప్రక్రియ జూలై 27 నుండి ప్రారంభమై జూలై 31 వరకు కొనసాగుతుంది.
ఫీజుల వివరాలు
ఆంధ్ర యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ఈ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన వార్షిక కోర్సు ఫీజు రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. దీనితో పాటు ప్రవేశాల సమయంలో అభ్యర్థులు అదనంగా రూ. 500 కౌన్సిలింగ్ ఫీజు విధిగా చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఈ కోర్సులలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ పద్ధతిలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, అప్లికేషన్ ఫారమ్ల డౌన్లోడ్, ఇతర సమాచారం కోసం విద్యార్థులు ఆంధ్రా యూనివర్సిటీ అధికారిక అడ్మిషన్ల వెబ్సైట్ను సందర్శించవచ్చని ప్రొఫెసర్ డి.ఎ. నాయుడు సూచించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


