ఏపీ ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!

AP Intermediate Schedule : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ విడుదలైంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూడండి.

Published on: Mar 24, 2026 8:06 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి(బీఐఈ) 2026-27 విద్యా సంవత్సరానికి గాను సాధారణ, వృత్తి విద్యా విభాగాలలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేసింది. బీఐఈ డైరెక్టర్ పి.రంజిత్ బాషా ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. నమోదు ప్రక్రియ గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారం, దరఖాస్తు ఫారాలు ఏప్రిల్ 1న ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 6 నుండి ప్రవేశాలు మొదలై, ఈ ప్రక్రియ జూన్ 1 నాటికి పూర్తవుతుంది.

ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల
ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

2026-27 విద్యా సంవత్సరానికి గాను, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లోని సాధారణ, వృత్తి విద్యా (Vocational) విభాగాలకు సంబంధించిన రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సుల ప్రవేశాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 'దరఖాస్తు పత్రాల విక్రయం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 6న మొదలై జూన్ 1 నాటికి పూర్తవుతుంది. కళాశాలల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు సంబంధించిన వివరాలను, కళాశాల యాజమాన్యాలు UDISE Plus పోర్టల్ (https://udiseplus.gov.in) ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలి.' అని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

అకడమిక్ క్యాలెండర్

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ విడుదలైంది. రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఏప్రిల్ 1వ తేదీన పున:ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి సెకండియర్ విద్యార్థులకు క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహిస్తారు. అంటే.. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి క్లాసులు జరుగుతాయి. అనంతరం ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 31 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్‌ క్యాలండర్‌ను విడుదల చేసింది.

ఈ అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మెుత్తం 232 రోజులు జూనియర్ కాలేజీలు పని చేస్తాయి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థుల ప్రవేశాలపై ఇంటర్ బోర్డు కొన్ని నిబంధనలు పెట్టింది. పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణత, ర్యాంకుల గ్యారంటీపై ప్రచారం చేయకూడని స్పష్టం చేసింది. ఇలా చేయడం చట్టవిరుద్ధమని చెప్పడమే కాకుండా.. కాలేజీల నడుమ అనారోగ్యకరమైన పోటీని సృష్టించేలా ఉంటుందని అధికారులు చెప్పారు.

నిబంధనల ప్రకారం జూనియర్ కళాశాలలు ఎలక్ట్రానికి, ప్రింట్ మీడియాలో ప్రకటనలు, హోర్డింగ్‌లు, కరపత్రాల పంపిణీ, గోడల మీద రాతలు వంటి చేయకూడదు. ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి, సీబీఎస్‌ఈ విధానాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్‌ పరీక్షల తర్వాత కూడా ఏప్రిల్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వేసవి సెలవులు ప్లాన్ చేసింది ఇంటర్ బోర్డు.

ముఖ్యమైన తేదీలు

  • ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23 వరకు క్లాసులు
  • ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
  • జూన్‌ 1న కాలేజీలు తిరిగి ప్రారంభం
  • అక్టోబరు 5 నుంచి 9 వరకు క్వార్టర్లీ పరీక్షలు
  • దసరా సెలవులు అక్టోబరు 10 నుంచి 20 వరకు
  • హాఫ్ ఇయర్లీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు
  • జనవరి 9 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
  • జనవరి 19 నుంచి 23 వరకు ప్రీఫైనల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరిలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు
  • ఫిబ్రవరి లేదా మార్చిలో థియరీ పబ్లిక్‌ పరీక్షలు
  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More