రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను శాస్త్రీయ దృక్పథంతో అంచనా వేసి, అక్టోబర్ 1వ తేదీన కరువు మండలాలను అధికారికంగా ప్రకటించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావం, కరవు ప్రభావం, వ్యవసాయ మరియు ఉద్యాన పంటల ప్రస్తుత స్థితిగతులు, రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో శనివారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంటలను కాపాడేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితులపై ఈ సమీక్షలో క్షుణ్ణంగా చర్చించారు.
513 మండలాల్లో తీవ్ర కరవు ఛాయలు….

రాష్ట్రంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై అధికారులు ప్రాథమిక నివేదికను సీఎంకు అందించారు. దీని ప్రకారం రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలోని 513 మండలాల్లో కరువు తీవ్రత నెలకొందని ప్రాథమికంగా నిర్ధారించారు. క్షేత్రస్థాయి బృందాలు నేరుగా పొలాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలిస్తాయని తెలిపారు. ఈ బృందాలు ఈ నెల 24వ తేదీలోగా తమ సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తాయి. అనంతరం సెప్టెంబర్ 29న రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశమై పూర్తిస్థాయి తుది నివేదికను ఖరారు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా అక్టోబర్ 1న ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
వర్షాభావం వల్ల దెబ్బతింటున్న ఉద్యాన పంటలను కాపాడుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. "ఉద్యాన పంటలను కాపాడటానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.190 కోట్లు కేటాయించింది. ఈ నిధుల సద్వినియోగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి" అని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎండిపోతున్న పంటలకు తక్షణమే తడులు అందించేలా క్షేత్రస్థాయి యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటి, బోర్లపై ఆధారపడే ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. ఇక విశాఖపట్నం నగరంలో రాబోయే రోజుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించి, విశాఖకు తాగునీటిని అందించేందుకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}రాష్ట్రంలో ఎక్కడా ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటి, బోర్లపై ఆధారపడే ప్రాంతాలకు అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని చెప్పారు. ఇక విశాఖపట్నం నగరంలో రాబోయే రోజుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా ఇప్పటి నుంచే పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో తక్షణమే అత్యవసర సమావేశం నిర్వహించి, విశాఖకు తాగునీటిని అందించేందుకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
{{/usCountry}}