ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్ - పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు! తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Andhra Pradesh Telangana Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉంది. చిత్తూరుకు ఆరెంజ్ అలెర్ట్, విజయనగరం, ఎన్టీఆర్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. తెలంగాణలో తేలికపాటి వర్షాలు పడొచ్చు.

Published on: Sep 5, 2026, 16:30:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Andhra Pradesh Telangana Weather Updates : తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు…. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.

ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్
ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్

దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

చిత్తూరు జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్….

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీసిటీ, సత్యవేడు, తడ మరియు దాని పరిసర ప్రాంతాలలో రాబోయే 3 గంటల్లో అక్కడక్కడా తీవ్రమైన పిడుగులతో కూడిన ఈదురుగాలుల వర్షం కురిసే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తా మరియు ఇతర జిల్లాల విషయానికి వస్తే విజయనగరం, అనకాపల్లి, ఎన్టీఆర్ మరియు కృష్ణా జిల్లాలకు అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని, ప్రయాణాల్లో ఉన్నవారు మరియు తీరప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్ :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం…. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే ఐదు రోజుల పాటు ఎలాంటి తీవ్ర హెచ్చరికలు లేవు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More