...
...
Next Story

AP 10Th Class Hall Ticket 2026 : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

AP 10Th Class Hall Ticket 2026 Download : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Published on: Mar 5, 2026, 06:45:07 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లు 2026 విడుదల అయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) 10వ తరగతి అడ్మిట్ కార్డులను దాని వెబ్‌సైట్, bse.ap.gov.inలో విడుదల చేసింది. అంతేకాదు విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, రెగ్యులర్, ప్రైవేట్, OSSC, OSSC ప్రైవేట్, వృత్తి విద్యార్థుల కోసం హాల్ టిక్కెట్లు జారీ అయ్యాయి.

ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్
ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్

పాఠశాల అధికారులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్థులకు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రైవేట్ అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను వెబ్‌సైట్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రధానోపాధ్యాయులు స్కూల్ లాగిన్‌ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయవచ్చు. అనంతరం వాటి మీద సంతకం, స్కూల్ స్టాంప్‌ వేసి విద్యార్థులకు అందజేయాలి.

విద్యార్థులు పాఠశాలకు వెళ్లి ఈ మేరకు హాల్ టికెట్లు తీసుకోవచ్చు. అంతేకాదు పదో తరగతి హాల్ టికెట్లు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు. వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర సర్వీస్ 9552300009 నంబర్ ద్వారా పొందాలి. అయితే వీటిపై సంతకం, స్కూల్ స్టాంప్ వేయించుకోవాలి.

AP SSC 2026 పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1, 2026 వరకు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుంది. పాఠశాలలు, ప్రైవేట్ అభ్యర్థులు హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని, పరీక్షలు ప్రారంభమయ్యే ముందు విద్యార్థులు వాటిని పొందేలా చూసుకోవాలని అధికారులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe