ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) అసెంబ్లీ సమావేశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అవసరమైతే సమావేశాలను పొడిగించే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర బడ్జెట్ను ఫిబ్రవరి 14న సమర్పించనున్నారు. ఫిబ్రవరి 15 ఆదివారం కావడం, మహా శివరాత్రి తర్వాత ఫిబ్రవరి 16 సెలవు దినంగా ఉన్నందున, బడ్జెట్పై చర్చలు ఫిబ్రవరి 17, 18 తేదీలలో జరుగుతాయి. ఫిబ్రవరి 18న చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీ ఉండవు. మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 6, 7న బడ్జెట్పై మరోసారి చర్చ ఉండనుంది. ఆ తర్వాత అవసరం మేరకు అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు. సభ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశమవుతుంది, ప్రశ్నోత్తరాల సమయం ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజూ జీరో అవర్ ఉంటుంది. గ్రాంట్ల డిమాండ్లపై చర్చలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశంలో ఆరు ఆర్డినెన్స్లకు కూడా సభ ఆమోదం తెలపనుంది.
ఏఐ ఆధారిత అటెండెన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ అమలులో రానుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. పలు కంపెనీల సీఈవోలు సైతం ప్రస్తుతం కూడా బయోమెట్రిక్ విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు. 'పార్లమెంటులోనూ ఈ విధానం ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తున్నారు. సభ్యులు తమ స్థానాల్లో కూర్చుంటేనే హాజరు నమోదు అవుతుంది. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తాం.' అని అయ్యన్నపాత్రుడు చెప్పారు.
అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామని అయ్యన్నపాత్రుడు అన్నారు. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్ దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని చెప్పారు. చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో కొత్త అసెంబ్లీ వ్యూ అత్యద్భుతంగా ఉంటుందన్నారు. 2028 డిసెంబల్ అసెంబ్లీ సమావేశాలు కొత్త భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని.. పెరగనున్న అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాలను దృష్టిలో పెట్టుకుని 300కు పైగా సీటింగ్ కొత్త సభలో ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
{{/usCountry}}అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ నెలాఖరులో గృహప్రవేశాలు చేస్తామని అయ్యన్నపాత్రుడు అన్నారు. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం ప్లాన్ దేశంలోనే అత్యుత్తమంగా ఉంటుందని చెప్పారు. చుట్టూ నీరు, 250 మీటర్ల ఎత్తులో కొత్త అసెంబ్లీ వ్యూ అత్యద్భుతంగా ఉంటుందన్నారు. 2028 డిసెంబల్ అసెంబ్లీ సమావేశాలు కొత్త భవనంలో జరిగేలా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని.. పెరగనున్న అసెంబ్లీ, ఎమ్మెల్సీ స్థానాలను దృష్టిలో పెట్టుకుని 300కు పైగా సీటింగ్ కొత్త సభలో ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
{{/usCountry}}