ఆంధ్రప్రదేశ్లో జీవవైవిధ్య (Biodiversity) పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. కేవలం అడవులు, జాతీయ పార్కులు, వన్యప్రాణి అభయారణ్యాలకే పరిమితం కాకుండా.. వాటి వెలుపల ఉన్న వివిధ రకాల వృక్షజాలం, జంతుజాలం సంరక్షణ కోసం 'ఓఈసీఎం' (OECM - Other Effective Area-based Conservation Measures) విధానాన్ని చేపట్టాలని ఏపీఎస్బీబీ నిర్ణయించింది.
అసలు ఓఈసీఎం అంటే ఏమిటి?

ఈ సరికొత్త పర్యావరణ పరిరక్షణ విధానంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టతనిచ్చారు. 'సాధారణంగా ఒక రక్షిత ప్రాంతం అనేది పూర్తిగా ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ కోసమే కేటాయించబడుతుంది. కానీ, 'ఓఈసీఎం' (OECM) పరిధిలోకి వచ్చే ప్రాంతాలు అలా కాదు. ఇవి స్థానిక సంఘాల వినియోగం, పారిశ్రామిక గ్రీన్ బెల్ట్లు లేదా నీటి నిర్వహణ వంటి ఇతర ప్రాథమిక లక్ష్యాల కోసం నిర్వహిస్తారు. అయితే ఈ ప్రక్రియలో అనుబంధంగా అక్కడ దీర్ఘకాలికంగా, సహజసిద్ధమైన జీవవైవిధ్య పరిరక్షణ చాలా ప్రభావవంతంగా జరుగుతుంది.' అని అన్నారు.
అంటే అటవీ శాఖ అధికారికంగా ప్రకటించిన అడవులు కాకపోయినప్పటికీ.. జీవవైవిధ్యానికి నిలయాలుగా మారిన ప్రాంతాలను గుర్తించి, వాటిని కాపాడటమే ఈ ఓఈసీఎం ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లోని సుదీర్ఘ తీరప్రాంతం, నదుల పరివాహక ప్రాంతాలు, చిత్తడి నేలలు, వనాలు వంటి ఎన్నో ప్రాంతాలు అధికారిక అటవీ పరిధిలోకి రావు. కానీ అక్కడ అరుదైన పక్షులు, జంతువులు, ఔషధ మొక్కలు జీవిస్తుంటాయి. వీటిని ఓఈసీఎం విధానంలో పరిరక్షించవచ్చు.
ఈ విధానం ద్వారా స్థానిక ప్రజలు, రైతులు, పరిశ్రమలను భాగస్వామ్యులను చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఐయూసీఎన్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం గుర్తించిన ఈ విధానాన్ని ఏపీలో పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా అంతర్జాతీయంగా రాష్ట్రానికి గుర్తింపు లభిస్తుంది.
పారిశ్రామిక ప్రాంతాల్లోని గ్రీన్ బెల్టులు, చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలను ఓఈసీఎం సైట్లుగా మార్చడం ద్వారా కాలుష్య నివారణతో పాటు వన్యప్రాణులకు ఆవాసాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి సంభావ్య ఓఈసీఎం ప్రాంతాలను గుర్తించేందుకు త్వరలోనే క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించనున్నట్లు, జీవవైవిధ్య రిజిస్టర్లను మరింత బలోపేతం చేయనున్నట్లు ఏపీఎస్బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు.
{{/usCountry}}పారిశ్రామిక ప్రాంతాల్లోని గ్రీన్ బెల్టులు, చెరువుల చుట్టుపక్కల ప్రాంతాలను ఓఈసీఎం సైట్లుగా మార్చడం ద్వారా కాలుష్య నివారణతో పాటు వన్యప్రాణులకు ఆవాసాలు లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇలాంటి సంభావ్య ఓఈసీఎం ప్రాంతాలను గుర్తించేందుకు త్వరలోనే క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించనున్నట్లు, జీవవైవిధ్య రిజిస్టర్లను మరింత బలోపేతం చేయనున్నట్లు ఏపీఎస్బీబీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పేర్కొన్నారు.
{{/usCountry}}