ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నాయని తెలిపింది.
రాయలసీమకు వర్ష సూచన…

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ,రేపు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో వడగాలులు వీచే అవకాశం ఉంది.
ఇవాళ(మార్చి 30) విజయనగరం జిల్లాలోని బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర మండలాలకు వడగాలుల హెచ్చరికలు జారీ అయ్యాయి. మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం, అల్లూరి జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉంది.
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 78 ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలోని గూడూరులో 42.4 డిగ్రీలు, మార్కాపురం జిల్లాలోని నందనమారెల్ల వద్ద 42.3 డిగ్రీలు, కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
నాగలాపురం (తిరుపతి), సింధురాజపురం (చిత్తూరు), రాజం (విజయనగరం), నుజెండ్ల (పల్నాడు), కొండపి (ప్రకాశం), నంద్యాల వంటి ఇతర ప్రదేశాలలో 40.8 నుంచి 41.7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా…. మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లకపోవటం మంచిదని పేర్కొంటున్నారు. తగినంత మంచి నీళ్లను తీసుకోవాలని… టోపీ, కాళ్లజోడు వంటివి వాడాలని సూచిస్తున్నారు.
తెలంగాణలోనూ వర్షాలు:
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే గురువారం వరకు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
మరోవైపు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో సహా మూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉండగా… మిగిలిన జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి.
{{/usCountry}}మరోవైపు తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో సహా మూడు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉండగా… మిగిలిన జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి.
{{/usCountry}}