సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 5కు సవరణ చేయాలని తీర్మానించింది. చట్టంలో కొత్త రాజధాని ప్రస్తావనకు బదులుగా అమరావతి పేరును చేర్చాలని మంత్రివర్గం ప్రతిపాదించింది. అలాగే, నీరుకొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీలో 60 మీటర్ల ఎత్తు వరకు విద్యా భవనాల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

ఇతర కీలక నిర్ణయాలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే వడ్డెర కమ్యూనిటీ సంఘాలకు ఖనిజ లీజుల ప్రాధాన్యతా కేటాయింపుపై చర్చించింది. ఖనిజ లీజు కేటాయింపులకు సంబంధించిన ప్రీమియం, సీనియరేజ్ ఫీజులలో 50 శాతం రాయితీని కూడా కేబినెట్ ఆమోదించింది.
కుప్పంలోని బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయడానికి కూడా ఆమోదం లభించింది. 2025–28 ఆర్థిక సంవత్సరానికి గాను బకాయి ఉన్న ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేయాలని, జలవనరుల శాఖ పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులలో ఆధునీకరణ, మరమ్మతు పనులకు పరిపాలనా అనుమతి ఇవ్వాలని, అలాగే వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది.
సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
గుంటూరు, నెల్లూరు, కాకినాడ, విశాఖపట్నం నగరాల్లో ఎల్పీజీ వినియోగదారులను పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వైపు మళ్లించే చర్యలు ప్రారంభం. 'పీఎన్జీ ద్వారా నిరంతర గ్యాస్ సరఫరా-అపార్ట్మెంట్లు, పారిశ్రామిక యూనిట్లకు కేంద్ర ప్రోత్సాహకాలు. ప్రధాన దేవాలయాల్లో కూడా పీఎన్జీ సదుపాయం కల్పించాలని ఆదేశాలు ఇస్తాం. దీపం సబ్సిడీ పథకం పీఎన్జీ వినియోగదారులకు విస్తరణ దిశగా చర్యలు. రెండు నెలలకు ఒకసారి సబ్సిడీ-రూ.2400 డీబీటీ ప్రయోజనం. పైప్లైన్ కనెక్షన్లకు 24 గంటల్లో అనుమతులు, అవసరమైతే ఆటోమేటిక్ సిస్టమ్. 10 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. నెలరోజుల్లో 1 లక్ష కనెక్షన్లు అందించే కార్యాచరణ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టౌల పంపిణీ చేస్తాం.' అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ సబ్ స్క్రైబర్స్కు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల చెప్పారు. దీపం పథకంలో నాలుగు నెలలకు ఒకసారి ఫ్రీ సిలెండర్ ఇస్తున్నామన్నారు. పీఎన్జీలో రెండు నెలలకు ఒకసారి ఆ పేమెంట్ను షేర్ చేస్తామని మంత్రి వెల్లడించారు.
{{/usCountry}}దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ సబ్ స్క్రైబర్స్కు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల చెప్పారు. దీపం పథకంలో నాలుగు నెలలకు ఒకసారి ఫ్రీ సిలెండర్ ఇస్తున్నామన్నారు. పీఎన్జీలో రెండు నెలలకు ఒకసారి ఆ పేమెంట్ను షేర్ చేస్తామని మంత్రి వెల్లడించారు.
{{/usCountry}}'సోషల్ మీడియా భయాందోళనలు సృష్టిస్తోంది. ఏపీలో ఎక్కడా పెట్రోల్, గ్యాస్, డీజిల్ విషయంలో కొరత లేదు. ప్రతిరోజు 2 లక్షల 70 వేల మందికి గ్యాస్ సిలెండర్లు అందిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహంతో ఇండక్షన్ స్టవ్లు అంగన్వాడీ కేంద్రాల్లో అందజేస్తున్నాం. దేశంలోనే మొదటిసారి ఏపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పాలసీగా తీసుకుని అమలు చేస్తోంది.' అని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.