అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణం - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదముద్ర వేశారు. అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Published on: Dec 11, 2025 5:07 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో లోక్‌భవన్‌, అసెంబ్లీ దర్బార్‌ హాల్‌, గవర్నర్‌ కార్యాలయం, రెండు గెస్ట్‌ హౌస్‌లు, స్టాఫ్‌ క్వార్టర్ల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
ఏపీ కేబినెట్ నిర్ణయాలు

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 32 శాతం పెరగడంపై కేబినెట్ సంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్తులోనూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని కేబినెట్ నిర్ణయించింది.

పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు, కపాస్ కిసాన్ యాప్ లోని సాంకేతిక లోపాలను సరిదిద్దాలని మరియు మిర్చి వంటి పంటలకు మెరుగైన మార్కెట్ కల్పించే అంశంపై మంత్రివర్గం చర్చించడం జరిగింది. ​​రాష్ట్రానికి రూ. 20 వేల కోట్లకుపైగా పెట్టుబడులు, సుమారు 56 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.సీఆర్డీఏకు నాబార్డు నుంచి రూ. 7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

సీడ్ యాక్సెస్ రహదారిని 16వ హైవేకి అనుసంధాన పనులకు రూ.532 కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్‌ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన సంక్షేమశాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతికి ఆమోదముద్ర లభించింది.