AP Cabinet Decisions : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకమైన మరియు ప్రాధాన్యత కలిగిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మొత్తం 57 అజెండా అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గం…. వాటికి ఆమోదం తెలుపుతూ పచ్చజెండా ఊపింది. ఈ భేటీలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు….

రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) తగిన ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ…. వాటిని చట్టబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని (రూరల్) స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా, పట్టణ ప్రాంతాల్లో (అర్బన్) 33.13 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా సరైన గుర్తింపు, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో చాలా రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉన్న అనిశ్చితికి కేబినెట్ తెరదించింది. రాబోయే అక్టోబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని మరియు రిజర్వేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది.
ప్రత్యక్ష పద్ధతిలో మేయర్లు, చైర్మన్ల ఎన్నిక…
పాలనా సంస్కరణల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల పదవులకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. అంటే…. ప్రజలే నేరుగా ఓటు వేసి తమ మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ నిర్ణయం ద్వారా స్థానిక సంస్థల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
{{/usCountry}}పాలనా సంస్కరణల్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల పదవులకు ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. అంటే…. ప్రజలే నేరుగా ఓటు వేసి తమ మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ మేయర్లను ఎన్నుకుంటారు. ఈ నిర్ణయం ద్వారా స్థానిక సంస్థల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
{{/usCountry}}అంతేకాకుండా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సంఖ్య, పాలనా వ్యవస్థపై స్పష్టతనిస్తూ ఇకపై ప్రతి మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్లో ఒక్కరే డిప్యూటీ మేయర్ లేదా వైస్ చైర్మన్ ఉండేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానాలు రాబోయే అక్టోబర్ ఎన్నికల నుంచే అమలులోకి రానున్నాయి.
మరోవైపు కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక విశాఖలో అక్షత్ గ్రీన్టెక్ సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి, సూర్యలంక, కేశరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.