...
...
Next Story

నాలా చట్టం రద్దు…పైగా ట్యాక్స్ కూడా తగ్గింపు..! రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు

ఏపీ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. నాలా చట్టం రద్దుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ… లోతుగా అన్ని విషయాలను పరిశీలిస్తోంది. తుది ముసాయిదా ప్రతిపాదనల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు ఇచ్చింది.

Published on: Jun 12, 2025, 15:20:50 IST
By , , Andhrapradesh
Prefer HTon Google
Advertisement

వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసుకునేందుకు ఉద్దేశించిన ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్(కన్వర్షన్ ఆప్ నాన్ అగ్రికల్చరల్ పర్ససెస్) యాక్ట్ 2006ను రద్దు చేసేందుకు విధివిధానాలు రూపొందించనున్నారు. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం ఆదేశాలను జారీచేసింది.

ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

వ్యవసాయేతర అవసరాలకు భూములను మార్పిడి చేసుకునేందుకు నాలా చట్టం వల్ల ఇప్పటి వరకు అనేక రకాల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు… మూడో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. ఇదే విషయంతో పాటు రెవెన్యూ శాఖలో తీసుకురావాల్సిన అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటైంది.

ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో మూడోసారి భేటీ అయ్యింది. రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగానిసత్యప్రసాద్ అధ్యక్షతన ఈ భేటి జరిగింది. ఇందులో అనగాని సత్యప్రసాద్ తోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సులభంగా భూమార్పిడి..!

ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజలు ట్యాక్స్ కట్టేస్తే ఆటోమేటిక్ గా భూ మార్పిడి జరిగేలా ముసాయిదా విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రులు చెప్పారు. భూ మార్పిడి అత్యంత సులభంగా జరగాలని అభిప్రాయపడ్డారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఎలా చేయాలనే దానిపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాక్స్ తగ్గింపుపై కూడా…!

తదుపరి సమావేశంలో అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించనున్నారు. నిర్ణయించిన విధివిధానాలను మంత్రివర్గం ముందు పెడతామని మంత్రులు చెప్పారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ…. ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలాను రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేకాక నాలా ట్యాక్స్ కూడా ఎక్కువగా ఉందని పలు సంఘాల నుండి అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఆ ట్యాక్స్ ను కూడా ఎంతమేరకు తగ్గించవచ్చో ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. వీలైతే ఈ ప్రతిపాదనలను జూన్ 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో పెట్టి చర్చిస్తామని తెలిపారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe