AP Degree Admissions 2026 : రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. 2026-27 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ను మంగళవారం(ఇవాళ) విడుదల చేయనున్నారు.

డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే రిజిస్ట్రేషన్ల నుంచి సీట్ల కేటాయింపు వరకు అన్ని ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉన్నత విద్యాశాఖ ప్రకటించిన టైమ్లైన్ ప్రకారం విద్యార్థులు తమ వద్ద ఉన్న సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
డిగ్రీ అడ్మిషన్ల సమగ్ర షెడ్యూల్ - ముఖ్య తేదీలు :
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు : ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విద్యార్థులు అధికారిక పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
- సర్టిఫికెట్ల పరిశీలన (HLC) : హెల్ప్డెస్క్ సెంటర్లలో విద్యార్థుల ధ్రువపత్రాల (సర్టిఫికెట్లు) పరిశీలన ప్రక్రియ ఈ నెల 5వ తేదీన ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతుంది.
- ప్రత్యేక కేటగిరీల పరిశీలన ఎన్సీసీ, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను ఈ నెల 12 మరియు 13 తేదీల్లో పరిశీలిస్తారు.
- వెబ్ ఆప్షన్ల నమోదు : తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
- వెబ్ ఆప్షన్ల సవరణ : ఎంచుకున్న ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ నెల 20వ తేదీన అవకాశం కల్పిస్తారు.
- సీట్ల కేటాయింపు : అభ్యర్థులు నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లు, మెరిట్ ఆధారంగా ఈ నెల 26న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
- కళాశాలల్లో రిపోర్టింగ్ : సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27 నుంచి 29వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలల్లో నేరుగా హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ - https://oamdc.ucanapply.com
ఈ నెల 27 నుంచే డిగ్రీ తరగతులు
నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను ఈ నెల 27వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువు లోపలే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
{{/usCountry}}నూతన విద్యాసంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను ఈ నెల 27వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువు లోపలే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
{{/usCountry}}