రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 ప్రవేశాలకు సంబంధించిన చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు సీటు పొందని వారికి, వచ్చిన సీటు కంటే మెరుగైన కళాశాలలో అవకాశం కోసం చూస్తున్న అభ్యర్థులకు ఇది చివరి అవకాశం.

అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమ ధ్రువపత్రాలను సరిచూసుకోవాలని కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈఏపీసెట్ తుది విడత కౌన్సెలింగ్కు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు.
ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఆగస్టు 20, 2026 వరకు అవకాశం ఇచ్చారు.
- హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల ఆన్లైన్ వెరిఫికేషన్: ఆగస్టు 21, 2026 వరకు పూర్తి చేస్తారు.
- వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 22, 2026 వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.
- వెబ్ ఆప్షన్లలో మార్పులు: నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లను సరిదిద్దుకునేందుకు ఆగస్టు 23, 2026న అవకాశం కల్పిస్తారు.
- సీట్ల కేటాయింపు (సీట్ అలాట్మెంట్): ఆగస్టు 26, 2026న ఫలితాలను విడుదల చేస్తారు.
- కాలేజీలలో రిపోర్టింగ్ : సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 27, 2026 నుంచి ఆగస్టు 31, 2026 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు సంబంధిత కళాశాలల్లో వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది.
- తరగతుల ప్రారంభం : ఇంజినీరింగ్ కళాశాలల్లో ఆగస్టు 27, 2026 నుంచే తరగతులు ప్రారంభమవుతాయి.
- అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/
మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు రాని విద్యార్థులు, అలాగే మొదటి విడతలో సీటు వచ్చినా నచ్చక కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవాలనుకునే విద్యార్థులు ఈ తుది విడతలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అయితే, మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు పొంది, ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును ఖరారు (కన్ఫర్మ్) చేసుకున్న విద్యార్థులకు ఈ తుది విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ కోరారు.
{{/usCountry}}మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు రాని విద్యార్థులు, అలాగే మొదటి విడతలో సీటు వచ్చినా నచ్చక కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవాలనుకునే విద్యార్థులు ఈ తుది విడతలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. అయితే, మొదటి విడత కౌన్సెలింగ్లో సీటు పొంది, ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును ఖరారు (కన్ఫర్మ్) చేసుకున్న విద్యార్థులకు ఈ తుది విడత కౌన్సెలింగ్లో పాల్గొనేందుకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సెలింగ్ కన్వీనర్ కోరారు.
{{/usCountry}}