ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్(AP EAPCET) 2026 ఫలితాల విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేస్ ఎక్స్ వేదికంగా ఫలితాలను విడుదల చేశారు. నిజానికి జూన్ 30వ తేదీన ఫలితాలు రావాల్సి ఉంది. కానీ సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున.. విద్యార్థుల అభ్యర్థన మేరకు వాయిదా వేశారు. ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిలై అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈఏపీసెట్లో 25 శాతం వెయిటేజీ ఇవ్వాల్సి ఉండటంతో ఈఏపీసెట్ ఫలితాలు వాయిదా వేశారు. లైన్ క్లీయర్ కావడంతో ఫలితాలు విడుదల చేశారు.
AP EAPCET ఫలితాలను ఎలా చూసుకోవాలి?

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా పొందొచ్చు.
అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
హోం పేజీలోని రిజల్ట్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్తో పాటు ఇతర వివరాలను నమోదు చేయాలి.
సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్ కాపీని పొందొచ్చు.
ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా ఫలితాలను చూసుకోవచ్చు.
'ఇంజనీరింగ్లో 1,82,317 మంది అర్హత సాధించారు(70.52 శాతం). అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 63,546 మంది అర్హత సాధించారు (89.59 శాతం). ఇంజనీరింగ్లో 71.65 శాతం ఉత్తీర్ణత శాతంతో అమ్మాయిలు ముందంజలో నిలవడం గర్వకారణం.' అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
మనమిత్ర వాట్సాప్(9552300009) ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. హాయ్ అనే మేసేజ్ చేసి ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంచుకోవాలి. ఇక్కడ అభ్యర్థి హాల్ టికెట్ నెంబర్ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డును పొందొచ్చు.
ఏపీ ఈఏపీసెట్ 2026లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు చేస్తారు. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ఏపీ ఈఏపీసెట్ 2026 వివరాలు
{{/usCountry}}ఏపీ ఈఏపీసెట్ 2026లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు చేస్తారు. విడతల వారీగా నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల ప్రక్రయను పూర్తి చేస్తారు. సీట్లు మిగిలితే స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ అవుతాయి.
ఏపీ ఈఏపీసెట్ 2026 వివరాలు
{{/usCountry}}ఏపీ ఈఏపీసెట్-2026కు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,55,803 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,29,474 మంది పరీక్షలు రాశారు. మొత్తంగా 92.60 శాతం హాజరు నమోదైంది.
ఈఏపీసెట్ 2026లో విద్యార్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఫలితాలు, ర్యాంకుల విడుదల పూర్తయిన తర్వాత.. సీట్ల భర్తీ ప్రక్రియ కోసం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి (APSCHE) అధికారిక కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటిస్తుంది. విడతల వారీగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు.