క్లాస్రూమ్లకే పరిమితం కాదు.. ఫిల్డ్ వర్క్లోకి విద్యార్థులు.. క్రెడిట్ పాయింట్లు!
తెలంగాణలో విద్యార్థులకు డిగ్రీ, పీజీల్లో ఇక మీదట ఫీల్డ్ వర్క్ ఉండనుంది. ఎక్స్పీరియెన్షియల్ లెర్నింగ్(అనుభవాత్మక విద్య) పేరుతో కొత్త పాలసీని ఉన్నత విద్యామండలి తీసుకొస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కేవలం తరగతి గదులకు పరిమితం కాకుండా రియల్ వరల్డ్ అనుభవాల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో అనుభవాత్మక విద్య విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) సన్నద్ధమవుతోంది. 2026-27 విద్యా సంవత్సరం నుండి ఈ నూతన విధానం అమలులోకి రానుంది.

తెలంగాణలో ఉన్నత విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు అనుభవ ఆధారిత విద్యా విధానాన్ని అమలులోకి తీసుకురావడం ఒక సానుకూల పరిణామం. దీని ద్వారా కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటారు. ఉన్నత విద్యలో అనుభవ ఆధారిత అభ్యాసాన్ని తీసుకురావడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి ప్రస్తుతం డిగ్రీ, పీజీతోపాటుగా ఇతర కోర్సుల్లో ప్రస్తుత చదువులు, మార్కెట్ అవసరాలకు తగినట్టుగా లేవని విమర్శలు ఉన్నాయి. దీంతో ఎక్స్పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్సామ్స్ను దానికి తగ్గట్టుగా ప్రభుత్వం డిజైన్ చేసింది.
ఇంటర్న్షిప్లు, పరిశ్రమల అనుభవం విద్యార్థులలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుతుంది. వారి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది. నిజ జీవిత సమస్యలను పరిష్కరించడం ద్వారా విద్యార్థులలో విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం పెంపొందుతుంది. గ్రామ దత్తత, సామాజిక సేవ వంటి కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో సామాజిక బాధ్యత పెంపొందుతుంది. విద్యార్థుల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలను టీజీసీహెచ్ఈ సూచిస్తోంది.
కొత్త అనుభవాలను పొందడం వల్ల విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందుతాయి. ఈ అనుభవ ఆధారిత అభ్యాస విధానంలో విద్యార్థులకు క్రెడిట్ పాయింట్లు లభిస్తాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 12-20 క్రెడిట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో 8-12 క్రెడిట్లు, డాక్టోరల్ కోర్సులలో 12-16 క్రెడిట్లు కేటాయిస్తారు. ఇంటర్న్షిప్లు, గ్రామ దత్తత, సామాజిక సేవ, కేస్ స్టడీలు, ఫీల్డ్-ఆధారిత ప్రాజెక్ట్లు, వివిధ అనుభవ ఆధారిత అభ్యాస కార్యకలాపాలను నిర్వహించడానికి కాలేజీలకు స్వేచ్ఛ ఉంటుంది.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న ఈ నిర్ణయం తెలంగాణలో ఉన్నత విద్య నాణ్యతను పెంచేందుకు, విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు సహాయపడుతుంది. కాలేజీలు కూడా ఈ కొత్త విధానాన్ని అనుసరించి విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థులు కూడా ఈ నూతన విద్యా విధానాన్ని సద్వినియోగం చేసుకొని తమ కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


