AP Forest Department Drone Seed Balls : రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సమతుల్యతను కాపాడడం, క్షీణించిన అడవులను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారీ, పంపిణీ కార్యక్రమం ఇప్పుడు క్షేత్రస్థాయిలో వేగంగా ముందుకు సాగుతోంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను మించి అధికారులు, ప్రజలు భాగస్వామ్యమయ్యారు. తొలుత రాష్ట్రవ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా…. ప్రజల క్రియాశీల భాగస్వామ్యంతో ఏకంగా 3.80 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేశారు.
ప్రస్తుతం వర్షాకాలం అనుకూలించడంతో ఈ విత్తన బంతులను అటవీ ప్రాంతాల్లో వెదజల్లే ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే 90 లక్షల సీడ్ బాల్స్ ను అటవీ సిబ్బంది…. స్థానికుల సహాయంతో మనుషులు చేరుకోగల ప్రాంతాల్లో విజయవంతంగా చల్లారు. అయితే, మనుషులు ప్రవేశించడానికి వీలులేని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి అటవీశాఖ తొలిసారిగా అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వాడుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సోమవారం రోజు…. చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ చరిత్రలో డ్రోన్ టెక్నాలజీ సాయంతో విత్తన బంతులను చల్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
చింతూరు అడవుల్లో…
చింతూరు అటవీ రేంజ్ పరిధిలో పచ్చదనం కోల్పోయిన సుమారు 440.50 హెక్టార్ల అటవీ భూములను అధికారులు ముందుగానే శాటిలైట్ సాయంతో గుర్తించారు. ఈ పరిధి కోసం మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో 2.71 లక్షల విత్తన బంతులను అటవీ సిబ్బంది కాలినడకన వెళ్లి చల్లారు.
{{/usCountry}}చింతూరు అటవీ రేంజ్ పరిధిలో పచ్చదనం కోల్పోయిన సుమారు 440.50 హెక్టార్ల అటవీ భూములను అధికారులు ముందుగానే శాటిలైట్ సాయంతో గుర్తించారు. ఈ పరిధి కోసం మొత్తం 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా, అందులో 2.71 లక్షల విత్తన బంతులను అటవీ సిబ్బంది కాలినడకన వెళ్లి చల్లారు.
{{/usCountry}}మిగిలిన అత్యంత మారుమూల, దుర్గమ ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో విత్తనాలను జారవిడుస్తున్నారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ డ్రోన్ సీడింగ్ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తుండడంతో…. వాతావరణ పరిస్థితులను బట్టి దీనిని కంసులూరు, మర్రిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకులకు సైతం విస్తరించడానికి అటవీశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీ, వితరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ అనూకూల, దేశీయ జాతుల విత్తనాలతో తయారు చేసిన సీడ్ బాల్స్, వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో తక్షణం వెదజల్లే పక్రియ ప్రారంభించాలని సూచించారు. వేప, చింత, నేరేడు, నోని, నల్లమద్ది, ఉసిరి, రేలా, తాని తదితర వృక్ష జాతుల విత్తనాలు సోమవారం డ్రోన్ ద్వారా వెదజల్లిన వాటిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా అటవీశాఖ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది.