దీపావళి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కానుక అందించింది. నవంబరు 1 నుంచి పెంచిన డీఏ చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు. దీనికి ప్రతీ నెలా రూ.160 కోట్ల వ్యయం అవుతుందని సీఎం వెల్లడించారు.

ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ “పోలీసులకు సరెండర్ లీవుల్లో ఒక ఇంస్టాల్ మెంట్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం. ఈ ఏడాది నవంబరులో ఒక విడత, 2026 జనవరిలో మరో విడతను చెల్లిస్తాం. 1 సరెండర్ లీవ్ చెల్లింపుల నిమిత్తం రూ.210 కోట్లు వ్యయం అవుతుంది. ఉద్యోగుల హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో అమల్లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. దీన్ని 60 రోజుల్లోగా పూర్తి చేసేలా కెబినెట్ సబ్ కమిటీ చర్యలు తీసుకుంటుంది. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం” అని ప్రకటించారు.
“చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తాం. ఉద్యోగుల అందరి గౌరవాన్ని మరింత పెంచేలా కొన్ని నామన్ క్లేచర్లను రీ డెజిగ్నేట్ చేస్తాం” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పీఆర్సీ విషయం నేను చూసుకుంటా - సీఎం చంద్రబాబు
“ప్రతీ నెలా 1 తేదీనే ఉద్యోగులకు వేతనం చెల్లిస్తున్నాం, పెన్షన్ చెల్లింపులు చేస్తున్నాం. రూ.15,921 కోట్ల బకాయిలు ఉద్యోగులకు క్లియర్ చేశాం. గతంలో పెట్టిన బకాయిలను రూ.23,556 కోట్లను సిస్టంలో అప్ లోడ్ చేశాం. రూ.9,371కోట్ల పాత స్కీమ్ లకు యూసీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తున్నాం. ఉద్యోగులకు మరింత సంక్షేమం అందివ్వాలన్న మనసు కూటమి ప్రభుత్వానికి ఉంది. మా ప్రభుత్వం ఉద్యోగులతో కలిసి పని చేస్తుంది. వెసులుబాటు వస్తే పీఆర్సీ కూడా ఇస్తాం. పీఆర్సీ విషయం నాకు వదిలిపెట్టమని ఉద్యోగులకు చెప్పాను” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
{{/usCountry}}“ప్రతీ నెలా 1 తేదీనే ఉద్యోగులకు వేతనం చెల్లిస్తున్నాం, పెన్షన్ చెల్లింపులు చేస్తున్నాం. రూ.15,921 కోట్ల బకాయిలు ఉద్యోగులకు క్లియర్ చేశాం. గతంలో పెట్టిన బకాయిలను రూ.23,556 కోట్లను సిస్టంలో అప్ లోడ్ చేశాం. రూ.9,371కోట్ల పాత స్కీమ్ లకు యూసీలు ఇచ్చాం. సూపర్ సిక్స్ లాంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఇస్తున్నాం. ఉద్యోగులకు మరింత సంక్షేమం అందివ్వాలన్న మనసు కూటమి ప్రభుత్వానికి ఉంది. మా ప్రభుత్వం ఉద్యోగులతో కలిసి పని చేస్తుంది. వెసులుబాటు వస్తే పీఆర్సీ కూడా ఇస్తాం. పీఆర్సీ విషయం నాకు వదిలిపెట్టమని ఉద్యోగులకు చెప్పాను” అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
{{/usCountry}}" రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులందరికీ ఎక్కడా ఇబ్బంది కలుగ కూడదనే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ధిక అంశాలపై ఎలాంటి దాపరికం లేదు. రాష్ట్రాభివృద్ధి యజ్ఞం చేస్తున్నాం. ఉద్యోగులతో కలిసే రాష్ట్రాన్ని తదుపరి అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లగలం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎంతో భేటీకి ఏపీఎన్జీవో, ఏపీజేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగ సంఘం సహా ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు.