రుషికొండ భవనాలను ఎలా ఉపయోగిస్తే బెటర్ అంటారు? మెయిల్ చేయండి!

వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలో కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ మేరకు భవనాలను ఎలా వినియోగిస్తే.. బాగుంటుందనే విషయంపై ప్రజల నుంచి సలహాలు, సూచలను ఆహ్వానించింది.

Published on: Oct 13, 2025, 09:41:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ.. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్‌ను టూరిజం ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాన్ని కోరింది. అక్టోబర్ 17న విజయవాడలో జరిగే సమావేశంలో పాల్గొనమని దేశీయ, అంతర్జాతీయ ఆతిథ్య సంస్థలను ఆహ్వానించింది. భవనాలు, దానికి ఆనుకుని ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని సాధ్యమైనంత ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి పౌరులు సూచనలు, ప్రతిపాదనలను సమర్పించాలని నోటిఫికేషన్ పేర్కొంది.

రుషికొండ భవనాలు
రుషికొండ భవనాలు

పర్యాటక ప్రమోషన్, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, పర్యావరణ-పర్యాటక, ఆతిథ్య వెంచర్‌లు, సాంస్కృతిక కేంద్రాలు లేదా మిశ్రమ వినియోగ నమూనాలకు సంబంధించిన ఆలోచనలను మీరు పంపవచ్చు. ఆసక్తి ఉన్న వ్యక్తులు నోటీసు ఏడు రోజుల్లోపు తమ సూచనలను rushikonda@aptdc.in కు ఇమెయిల్ చేయాలని పర్యాటక శాఖ కోరింది.

అక్టోబర్ 17న విజయవాడలోని ఏపీ టూరిజం భవనంలో జరిగే సమావేశంలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కాన్సెప్ట్ నోట్స్ లేదా ఆసక్తి వ్యక్తీకరణలు(EOI) పంచుకోవాలని, పాల్గొనాలని నోటిఫికేషన్ ఆహ్వానించింది. ప్రస్తుత స్థితిని వివరిస్తూ, ఆ భవనాలు పనిచేయడం లేదని, ప్రభుత్వం ప్రస్తుతం నెలకు రూ.25 లక్షలు నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు చేస్తోందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

మొత్తం నిర్మాణ ప్రాంతం 13,542 చదరపు మీటర్లు, ఇందులో నాలుగు G+1 నిర్మాణాలు ఉన్నాయి. విజయనగర బ్లాక్ (మూడు యూనిట్లు), గజపతి బ్లాక్ (ఒక యూనిట్), కళింగ బ్లాక్ (ఒక యూనిట్), వెంగి బ్లాక్ (రెండు యూనిట్లు). ఈ కాంప్లెక్స్‌లో లగ్జరీ సూట్‌లు, బాంకెట్ హాళ్లు, రెస్టారెంట్లు, స్పా, జిమ్, కాన్ఫరెన్స్ హాళ్లు, లాంజ్‌లు, సిబ్బంది వసతి వంటి సౌకర్యాలు ఉన్నాయి.

గత ఏడాది నవంబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కోసం విలాసవంతమైన నిర్మాణాన్ని నిర్మించారని విమర్శించారు. రుషికొండపై నిర్మించిన భవనాలకు సంబంధించిన వీడియోలు ఆ సమయంలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More