మీకు గ్రామకంఠం భూములు లేదా పాత ఇళ్లు ఉన్నాయా? వాటిని అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేయాలన్నా డాక్యుమెంట్లు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఏపీ ప్రభుత్వం ఒక అదిరిపోయే తీపి కబురు అందించింది. గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగిస్తూ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఇకపై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా.. కేవలం పన్ను రశీదులు లేదా స్వయం ధ్రువీకరణ ఉంటే చాలు, మీ భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది.
అసలు చిక్కు ఎక్కడ వచ్చింది?
గ్రామాల్లోని పాత నివాస ప్రాంతాలను సాధారణంగా గ్రామకంఠం భూములు అంటారు. వీటికి చాలా కాలంగా సరైన లింక్ డాక్యుమెంట్లు లేకపోవడం, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. పైగా ఈ సర్వే నంబర్లు పొరపాటున 22A (నిషేధిత ఆస్తుల జాబితా)లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వీటన్నింటికీ ప్రభుత్వం చెక్ పెట్టింది.
కొత్త రూల్స్ ఇవే
వెబ్లాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లకు ఈ క్రింది మార్గదర్శకాలు వర్తిస్తాయి:
నిషేధిత జాబితాతో పనిలేదు: మీ స్థలం ఉన్న సర్వే నంబర్ వెబ్లాండ్లో 'గ్రామకంఠం' అని ఉంటే చాలు.. అది 22A నిషేధిత జాబితాలో ఉన్నా, లేకపోయినా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే.
ఇల్లు ఉండి.. డాక్యుమెంట్లు లేకపోతే: పాత ఇల్లు ఉండి, ఎలాంటి లింక్ దస్తావేజులు లేని పక్షంలో.. స్థానిక సంస్థలు (పంచాయితీ లేదా మున్సిపాలిటీ) జారీ చేసిన ఇంటిపన్ను రశీదు చూపిస్తే చాలు, అధికారులు రిజిస్ట్రేషన్ చేయాలి.
పట్టణాల్లో ఖాళీ స్థలాలు ఉంటే: వంశపారంపర్యంగా వచ్చిన ఖాళీ స్థలాలకు లింక్ డాక్యుమెంట్లు గానీ, ఇంటి పన్ను రశీదు గానీ లేకపోతే.. ఖాళీ స్థల పన్ను (VLT) రశీదును అంగీకరిస్తారు.
{{/usCountry}}పట్టణాల్లో ఖాళీ స్థలాలు ఉంటే: వంశపారంపర్యంగా వచ్చిన ఖాళీ స్థలాలకు లింక్ డాక్యుమెంట్లు గానీ, ఇంటి పన్ను రశీదు గానీ లేకపోతే.. ఖాళీ స్థల పన్ను (VLT) రశీదును అంగీకరిస్తారు.
{{/usCountry}}గ్రామాల్లో ఖాళీ స్థలాలు ఉంటే (స్వయం ధ్రువీకరణ): పల్లెటూళ్లలో వంశపారంపర్య ఖాళీ స్థలాలకు ఎలాంటి కాగితాలు లేకపోతే, రిజిస్ట్రేషన్ పత్రంలోనే స్వయం ధ్రువీకరణ ఇస్తే సరిపోతుంది. తమకు వారసత్వంగా వచ్చిందని, తామే అనుభవిస్తున్నామని అందులో పేర్కొనాలి.
ఈ మార్పుతో ఎవరికి లాభం?
ఈ నిర్ణయం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది. వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తులపై హక్కులు లభించడమే కాకుండా, అత్యవసర సమయాల్లో వాటిని అమ్ముకోవడానికి లేదా బ్యాంకు లోన్లు పొందడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ముఖ్య గమనిక: గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్ కోసం రెవెన్యూ అధికారుల నుంచి విడిగా ఎలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకోవాలని సబ్ రిజిస్ట్రార్లు ప్రజలను ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.