Bandi Bhageerath Case : బండి భగీరథ్ పోక్సో కేసు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Bandi Bhageerath Case : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
బండి సాయి భగీరథ్ పోక్సో కేసు గురించి ఇప్పుడు తెలంగామలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. భగీరథ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు భగీరథ్కు సంబంధించి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

భగీరథ్ పోక్సో కేసుపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఈ కేసు వ్యవహారంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
సీఎం సీరియస్
బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై నమోదైన కేసుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీనే ఫిర్యాదు అందినప్పటికీ నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
డీజీపీ సీవీ ఆనంద్ ఈ కేసులోని పూర్వాపరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలన్నీ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. ఆ కారణంగానే కేసు దర్యాప్తులో కొంత జాప్యం జరిగిందని ముఖ్యమంత్రికి డీజీపీ వివరణ ఇచ్చారు.
కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఎటువంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుపై ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఈ మేరకు సిట్ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ బీజేపీ ఏం అంటుంది?
బండి భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. బండి భగీరథ్ కేసుతో బీజేపీకి సంబంధంలేదన్నారు. బండి సంజయ్ కుటుంబీకుల జోక్యం ఉంటే విచారణ చేయించాలని రామచందర్రావు సూచించారు. ఇది వారి వ్యక్తిగత విషయం అని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ సభ విజయవంతంపై రామచందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


