ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లింలకు శుభవార్త చెప్పింది. హజ్ 2026 యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ సెంటర్ నుంచి వెళ్లేవారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు జీవో విడుదలైంది. హజ్ యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల నుంచి మక్కాకు వెళ్లేవారు. ఇప్పుడు విజయవాడలో ఎంబార్కేషన్ సెంటర్ ఏర్పాటుతో భారీ ఉపశమనం దక్కింది ఏపీ యాత్రికులకు.

ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది. అయితే రూ.లక్ష ఆర్థిక సాయం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేవారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఇతర నగరాల నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారికంటే.. విజయవాడ నుంచి వెళ్లేవారికి విమాన టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది. అదనపు భారం హజ్ యాత్రికులపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించాలని, అంతేకాకుండా రాజధాని అమరావతిని ప్రోత్సహించాలని ఆర్థిక సాయం అందిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. తదుపరి చర్యల కోసం మైనారిటీ సంక్షేమ శాఖ, రాష్ట్ర హజ్ కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.
హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయంతో యాత్రికులకు ఆర్థికంగా ఊరట లభించనుంది. విమాన టికెట్ ధరల్లో వ్యత్యాసం కారణంగా కలిగే అదనపు ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి దాదాపు 347 మంది అభ్యర్థులు విజయవాడ హజ్ ఎంబార్కేషన్ సెంటర్ ద్వారా నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హజ్ కమిటీ ఛైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. ఈ నిర్ణయం ముస్లిం సోదరుల్లో ఆనందాన్ని నింపుతోందన్నారు. హజ్ యాత్రికులు విజయవాడ సెంటర్ నుంచి ఎంచుకోవాలని కోరారు.
{{/usCountry}}హజ్ యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హజ్ కమిటీ ఛైర్మన్ షేక్ హసన్ బాషా తెలిపారు. ఈ నిర్ణయం ముస్లిం సోదరుల్లో ఆనందాన్ని నింపుతోందన్నారు. హజ్ యాత్రికులు విజయవాడ సెంటర్ నుంచి ఎంచుకోవాలని కోరారు.
{{/usCountry}}మరోవైపు వక్ఫ్బోర్డు వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకుంటోంది. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలువైన వక్ఫ్ భూములను సంబంధించి 89 అక్రమ అమ్మకాల పత్రాలను రద్దు చేయించింది. వీటి విలువ సుమారు రూ.650 కోట్లు. రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసింది. 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందురు చర్యలు చేపట్టింది. వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు ఈ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.