పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిబంధనలను ఉల్లంఘించిందని, అనుమతులు లేవని తెలిపింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర జల వివాదంపై మరోసారి చర్చ నడుస్తోంది. పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్(PNLP)(గతంలో పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్)ను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోదావరి నది నుండి మిగులు వరద జలాలను కృష్ణ, గుండ్లకమ్మ బేసిన్లకు మళ్లించే లక్ష్యంతో ఉన్న ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ కొనసాగించకుండా నిరోధించాలని కోరుతోంది.

1980 నాటి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, కేంద్ర జల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తోందని పిటిషన్లో తెలంగాణ ఆరోపించింది. పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ కొనసాగుతున్న విస్తరణ పనులు, నవంబర్ 21న విడుదలై నవంబర్ 24న సవరించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక తయారీకి ఇటీవల జారీ చేసిన ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్పై తాత్కాలిక స్టే విధించాలని కోరింది.
గోదావరిపై నిర్మాణంలో ఉన్న పోలవరం ఆనకట్ట నుండి రోజుకు 2 టీఎంసీ నీటిని మళ్లించడానికి సుమారు రూ. 58,000 కోట్ల అంచనా వేసి పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ రూపొందించారు. ఈ ప్రాజెక్టులో మూడు విభాగాలు ఉన్నాయి: మొదటిది పోలవరం ఆర్ఎంసీ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 35,000 క్యూసెక్కులకు పెంచడం లేదా కృష్ణ నదిలోకి నీరు పోయడానికి సమాంతర కాలువను నిర్మించడం, రెండోది 400 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యంతో బొల్లాపల్లి జలాశయాన్ని నిర్మించడం. మూడోది నల్లమల కొండ ప్రాంతంలోని సొరంగాల ద్వారా నీటిని ప్రకాశం జిల్లాలోని నల్లమల సాగర్ జలాశయానికి ఎత్తిపోయడం. ఇది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
తమ హక్కులకు భంగం వాటిల్లేలా ఏపీ వ్యవహరిస్తోందని తెలంగాణ చెబుతోంది. ఈ ప్రాజెక్టుతో గోదావరి బేసిన్లో తమకు కేటాయించిన నీటి వాటకు, హక్కులకు భంగ వాటిల్లుతుందని వాదిస్తోంది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా వెటనే అడ్డుకోవాలని, స్టే విధించాలని కోరింది.
అంతర్రాష్ట్ర చిక్కులు, పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా తెలంగాణలో ముంపు ప్రమాదాలు, పర్యావరణ ఉల్లంఘనలు వంటి ముఖ్యమైన ఆందోళనలు కూడా తెలంగాణ లేవనెత్తుతోంది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ జూన్ 2025లో ఈ ప్రతిపాదనను తిరిగి ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ను సీడబ్ల్యూసీతో అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవాలని ఆదేశించిందని సుప్రీం కోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్ పేర్కొంది.
2025 మేలో సీడబ్ల్యూసీకి సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ (PFR) కోసం సూత్రప్రాయంగా కూడా అనుమతి లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగిందని తెలంగాణ అంటోంది. డీపీఆర్ కోసం టెండర్లను జారీ చేసిందని తెలిపింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


