విడతల వారీగా ఆర్టీసీ బస్సులన్నీ త్వరలోనే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్గాట్-వేఫర్ ప్లాంట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. గ్రీన్ ఈవీ వాహనాలను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ కూడా 1,050 బస్సులను తీసుకువస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

'రాబోయే రోజుల్లో క్రమంగా ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం. మీరందరూ సహకరించాలి. కేవలం డబ్బు ఉన్నవాళ్లే కాదు. పేదలు కూడా ఏసీలో తిరగాలి. అంతేకాదు ప్రతీ ఇల్లూ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కావాలి. అందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.
విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిలబెట్టుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. 2019-24లో పీపీఏలు రద్దు చేసి, నిర్వహణ లోపాలతో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిందన్నారు. పీపీఏల రద్దు కారణంగా విద్యుత్ వాడుకోకుండానే రూ.9 వేల కోట్ల ప్రజాధనం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారాన్ని గత పాలకులు వేసి ట్రూ-అప్ ఛార్జీలు వసూలు చేశారని విమర్శించారు.
ఇప్పటికే 160 గిగావాట్లలో 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ తయారీకు అనుమతులు మంజూరు చేశామన్నారు చంద్రబాబు. గ్రీన్ ఎనర్జీలో ఎన్టీపీసీ రూ.1.85 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతోందన్నారు. వచ్చే ఏడాది ఈ పనులు కూడా ప్రారంభమవుతాయన్నారు. 'త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం. వెయ్యికిపై ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశాం. మరో 444 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి. మూడు సంవత్సరాలలో 5 వేలకుపైగా ఛార్జింగ్ స్టేషన్లు వస్తాయి.' అని చంద్రబాబు అన్నారు.
'గ్రీన్ ఎనర్జీతోనే ఏపీకి భవిష్యత్. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం. అన్ని బస్సులను ఏసీ బస్సులుగా మారుస్తాం. ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకోండి.. రాయితీ ఇస్తాం. అని ప్రకటించారు. 23 లక్షల మంది రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.4 వేల కోట్లకుపైగా ట్రూడౌన్ ఛార్జీల భారం తగ్గించాం.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}'గ్రీన్ ఎనర్జీతోనే ఏపీకి భవిష్యత్. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం. అన్ని బస్సులను ఏసీ బస్సులుగా మారుస్తాం. ప్రతి ఇంటిపై సోలార్ అమర్చుకోండి.. రాయితీ ఇస్తాం. అని ప్రకటించారు. 23 లక్షల మంది రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ.4 వేల కోట్లకుపైగా ట్రూడౌన్ ఛార్జీల భారం తగ్గించాం.' అని చంద్రబాబు అన్నారు.
{{/usCountry}}