AP IIIT Counselling Documents 2026 : ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. నేటి నుంచి ట్రిపుల్ ఐటీ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతిలో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఇప్పటికే ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న విద్యార్థులకు నిర్దేశిత కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఈ విద్యాసంవత్సరానికి గానూ నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ కౌన్సెలింగ్ ద్వారా జరుగుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు చేసేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి కేటాయించిన డిప్రెవేషన్ స్కోర్ను కలుపుతూ ఈ మెరిట్ జాబితాను సిద్ధం చేశారు. ఎంపికైన అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీలు… సమయాల ప్రకారం కౌన్సెలింగ్ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు వాటికి సంబంధించిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అధికారులు పరిశీలన కోసం అడిగే ముఖ్యమైన పత్రాల వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
విద్యార్థుల వద్ద ఉండాల్సిన పత్రాలు :
- అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కౌన్సెలింగ్ ప్రవేశ పత్రం (Call Letter).
- టెన్త్ క్లాస్ ఒరిజినల్ మార్క్షీట్ లేదా ఇంటర్నెట్ కాపీ.
- పదో తరగతి పరీక్షల హాల్ టికెట్.
- 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన పాఠశాలల స్టడీ సర్టిఫికెట్లు (స్థానికత నిర్ధారణ కోసం).
- రిజర్వేషన్ వర్తించే అభ్యర్థులు (BC, SC, ST) మీసేవ ద్వారా పొందిన తాజా క్యాస్ట్ సర్టిఫికెట్.
- ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తాజా ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డ్.
- ఓసీ అభ్యర్థుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు తాజా EWS సర్టిఫికెట్ సమర్పించాలి.
- పీహెచ్ (PH), క్యాప్ (CAP), ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్ కోటా ఉన్నవారు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు.
- ద్యార్థి ఆధార్ కార్డ్ ఒరిజినల్ మరియు జిరాక్స్.
- అభ్యర్థికి సంబంధించిన తాజా పాస్పోర్ట్ సైజు కలర్ ఫొటోలు (కనీసం 6 ప్రతులు).
కౌన్సెలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్జీయూకేటీ యంత్రాంగం అన్ని క్యాంపస్లలో ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వెంటనే విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఆర్డర్లను అందజేస్తారు. సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా సంబంధిత క్యాంపస్లలో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు విద్యార్థులు…. తల్లిదండ్రులు ముందే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
నూజివీడు క్యాంపస్ :
- నూజివీడు క్యాంపస్కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 19, జూన్ 20 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
- వేదిక: ఆర్జీయూకేటీ-నూజివీడు క్యాంపస్, ఏలూరు జిల్లా.
ఆర్కే వ్యాలీ క్యాంపస్ (ఇడుపులపాయ) :
- ఆర్కే వ్యాలీ క్యాంపస్కు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 19, జూన్ 20 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
- వేదిక: ఆర్జీయూకేటీ-ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ కడప జిల్లా.
ఒంగోలు క్యాంపస్ :
- ఒంగోలు క్యాంపస్కు సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఇడుపులపాయ క్యాంపస్లోనే కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి జూన్ 22, జూన్ 23 తేదీల్లో వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
- వేదిక: ఆర్జీయూకేటీ-ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ కడప జిల్లా.
శ్రీకాకుళం క్యాంపస్ :
- శ్రీకాకుళం క్యాంపస్కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 23, జూన్ 24 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది.
- వేదిక: ఆర్జీయూకేటీ-శ్రీకాకుళం క్యాంపస్, ఎచ్చెర్ల.
కౌన్సెలింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్జీయూకేటీ యంత్రాంగం అన్ని క్యాంపస్లలో ప్రత్యేక హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన వెంటనే విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఆర్డర్లను అందజేస్తారు. సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా సంబంధిత క్యాంపస్లలో ఫీజు చెల్లించి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణ సమయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు విద్యార్థులు…. తల్లిదండ్రులు ముందే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
నూజివీడు క్యాంపస్ :
- నూజివీడు క్యాంపస్కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 19, జూన్ 20 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.
- వేదిక: ఆర్జీయూకేటీ-నూజివీడు క్యాంపస్, ఏలూరు జిల్లా.
ఆర్కే వ్యాలీ క్యాంపస్ (ఇడుపులపాయ) :
- ఆర్కే వ్యాలీ క్యాంపస్కు ఎంపికైన అభ్యర్థులకు జూన్ 19, జూన్ 20 తేదీల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
- వేదిక: ఆర్జీయూకేటీ-ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ కడప జిల్లా.
ఒంగోలు క్యాంపస్ :
- ఒంగోలు క్యాంపస్కు సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఇడుపులపాయ క్యాంపస్లోనే కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుంది. వీరికి జూన్ 22, జూన్ 23 తేదీల్లో వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
- వేదిక: ఆర్జీయూకేటీ-ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఇడుపులపాయ, వైఎస్ఆర్ కడప జిల్లా.
శ్రీకాకుళం క్యాంపస్ :
- శ్రీకాకుళం క్యాంపస్కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 23, జూన్ 24 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది.
- వేదిక: ఆర్జీయూకేటీ-శ్రీకాకుళం క్యాంపస్, ఎచ్చెర్ల.