AP Inter Supplementary Exam Fee 2026 : విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 27 చివరి తేదీ కావాల్సి ఉండగా…. ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు పొడిగించారు.
ఇదే చివరి అవకాశం….

ఫీజు చెల్లింపు గడువు పొడిగింపుపై ఇంటర్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గడువును ఏప్రిల్ 30 వరకు పెంచినట్లు తెలిపింది. అయితే…. ఈ తేదీ తర్వాత మళ్లీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కాబట్టి ఫీజు చెల్లించాల్సిన విద్యార్థులు ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది. ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే తమ కళాశాల ప్రిన్సిపాల్స్ను సంప్రదించి ఫీజు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.
విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల ద్వారానే నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్లు మాత్రమే కాకుండా రెండవ సంవత్సరం విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేకపోయారో లేదా మార్కులు పెంచుకోవాలని (Improvement) భావిస్తున్నారో, వారందరూ ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా రుసుము చెల్లించడంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కళాశాలల యాజమాన్యాలకు బోర్డు ఆదేశాలు ఇచ్చింది.
సప్లిమెంటరీ పరీక్ష తేదీలు….
ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఈసారి సెకండియర్ విద్యార్థులకు కూడా అవకాశం ఉంది.
{{/usCountry}}ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 5న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 6న నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఈసారి సెకండియర్ విద్యార్థులకు కూడా అవకాశం ఉంది.
{{/usCountry}}