ఏపీ వైద్యారోగ్యశాఖలో 107 ఉద్యోగ ఖాళీలు - నోటిఫికేషన్ విడుదల
ఏపీ వైద్యారోగ్య శాఖ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 107 ఖాళీలను భర్తీ చేస్తారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉన్నాయి. నవంబర్ 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఏపీ వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 107 ఖాళీలున్నాయి. ఆయుష్ విభాగంలోని ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మొత్తం 107 ఖాళీలు…
మొత్తం 107 ఖాళీలు ఉండగా... వీటిలో అధికంగా ఆయుర్వేద డాక్టర్ పోస్టులు 51 ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగాలు 26, హోమియోపతి ఆయూష్ డాక్టర్ ఖాళీలు 15 ఉన్నాయి. యోగా ఇన్ స్ట్రక్టర్ పోస్టులు 4 ఉండగా.. వీటిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. మిగతా పోస్టులన్నీ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు.
ఈ పోస్టులకు నవంబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతుండగా… నవంబర్ 15వ తేదీతో గడువు ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
దరఖాస్తు విధానం, అప్లికేషన్ ఫీజు, అర్హతల వివరాలకు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు. ఈ వివరాలను https://hmfw.ap.gov.in లేదా https://ayush.ap.gov.in వెబ్ సైట్ లో కూడా తెలుసుకోవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper











