ఏపీ పీజీఈసెట్-2026 ఫలితాలను అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది కూడా అభ్యర్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఈ ఫలితాలను ప్రకటిస్తూ, అర్హత సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(APSCHE), APPGECET-2026 పరీక్ష నిర్వహణ బాధ్యతను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 పరీక్షా కేంద్రాలలో ఏప్రిల్ 28 నుండి 30, 2026 తేదీల మధ్య ఆరు విడతలుగా ఈ పరీక్ష విజయవంతంగా జరిగింది.
APPGECET-2026కు దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్య 12102గా ఉంది. పరీక్షకు 9990 మంది హాజరయ్యారు. 9320 అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థుల శాతం 93.29 శాతంగా ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురం 94.17 ఉత్తీర్ణత శాతంతో టాప్లో ఉంది. విజయనగరం 92.88 శాతంతో చివరలో ఉంది.
ఫలితాలను ఎలా చూసుకోవాలి?
అభ్యర్థులు తమ ఫలితాలను మరియు ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుండి సులభంగా పొందవచ్చు:
- ముందుగా అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.in సందర్శించండి.
- హోమ్ పేజీలో 'APPGECET-2026 Results లింక్పై క్లిక్ చేయండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి.
- వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేయాలి. ఫలితాలు కనిపిస్తాయి.
ఈ లింక్ క్లిక్ చేసి నేరుగా ఫలితాలు చూసుకోవచ్చు.
భవిష్యత్తు అవసరాల కోసం దానిని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోండి.
ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థులు తదుపరి దశ అయిన కౌన్సెలింగ్కు సిద్ధం కావాల్సి ఉంటుంది. జూలై, ఆగస్టులో జరగవచ్చు. ప్రవేశాల సమయంలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం. ఇందులో అభ్యర్థి సాధించిన మార్కులు, ర్యాంక్, పర్సంటైల్ వివరాలు ఉంటాయి.
గేట్ (GATE) / జీపాట్ (GPAT) అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, గేట్ లేదా జీపాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సీట్లను పీజీఈసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి షెడ్యూళ్లను విడుదల చేస్తారు.
{{/usCountry}}గేట్ (GATE) / జీపాట్ (GPAT) అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, గేట్ లేదా జీపాట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సీట్లను పీజీఈసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. దీనికి సంబంధించి షెడ్యూళ్లను విడుదల చేస్తారు.
{{/usCountry}}త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కానుంది. అభ్యర్థులు తమ విద్యా ధృవీకరణ పత్రాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలి.