ఏపీలో మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు.. నగదు ప్రోత్సాహకాలు!
Cash Incentives : ఏపీలో సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడో, నాలుగో బిడ్డ పుడితే నగదు ప్రోత్సహకాలను అందించాలని యోచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును పరిష్కరించే ప్రయత్నాల్లో భాగంగా మూడో, నాలుగో బిడ్డను కనే కుటుంబాలకు నగదు ప్రోత్సాహకాలు, పోషకాహార మద్దతును ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. మే 7, 8 తేదీలలో అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో చర్చించిన ఈ ప్రతిపాదనను, మూడు నెలల ప్రజాభిప్రాయ సేకరణ, అవగాహన కార్యక్రమం పూర్తయిన తర్వాత తుది ఆమోదం కోసం పంపనున్నారు.

ఒకవేళ ఇది అమలులోకి వస్తే.. మూడో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ఒకేసారి రూ. 30,000, నాలుగో బిడ్డకు జన్మనిచ్చే వారికి రూ. 40,000 ప్రోత్సాహకం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ప్రసవ సమయంలో నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేయడంతో పాటు, ఒక ఎన్టీఆర్ బేబీ కిట్ను కూడా అందజేస్తారు.
ఈ ప్రతిపాదనలో చిరుధాన్యాల రూపంలో పోషకాహార మద్దతు కూడా ఉంది. మూడో బిడ్డ పుట్టిన తర్వాత కుటుంబాలకు ప్రతి నెలా మూడు కిలోల చిరుధాన్యాలు, నాలుగో బిడ్డ పుట్టిన తర్వాత నెలకు ఆరు కిలోల చిరుధాన్యాలు అందుతాయి.
ప్రతిపాదిత ప్రోత్సాహక విధానంపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు 2026 మే, జూన్, జూలై నెలల్లో నెలవారీ గ్రామ సభలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించిన అనంతరం తుది ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను మంత్రివర్గం ముందు ఉంచుతారు. ఆమోదం లభిస్తే ఈ పథకం అమలు 2026 ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. అర్హులైన దంపతులలో అవగాహన ప్రచారాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించగా, జననాల రేటును పెంచడంపై కుటుంబాలకు సలహాలు ఇచ్చేందుకు ఆరోగ్య, ఇతర శాఖల సిబ్బంది ఆగస్టు వరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతారు.
ప్రతిపాదిత పథకం కింద మూడో లేదా నాల్గో సంతానంగా జన్మించిన పిల్లలను కూడా అంగన్వాడీ కేంద్రాలలో నమోదు చేయడంతో పాటు తల్లి కి వందనం కార్యక్రమంతో సహా సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకువస్తారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల్లో కూడా సంతానోత్పత్తి రేట్లు తగ్గుతున్నాయని, అందువల్ల దీర్ఘకాలిక జనాభా, ఆర్థిక సవాళ్లను నివారించడానికి ఇలాంటి చర్యలు అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రతి జంటకు సుమారు 1.5 పిల్లలకు పడిపోయిందని, 2040 నాటికి ఇది మరింతగా 1.2కు తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పని చేసే వయస్సు గల జనాభా నిష్పత్తి కూడా 62.9 శాతం నుంచి 57 శాతానికి పడిపోతుందని అంచనా వేయడంతో, భవిష్యత్ ఆర్థిక ఉత్పాదకతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 48.7 శాతం జంటలు ఒకే బిడ్డను కోరుకుంటుండగా, సుమారు 11.5 లక్షల జంటలు సంతానం లేకపోవడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అటువంటి జంటలకు ఐవీఎఫ్ చికిత్స అందించడానికి ప్రభుత్వం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలను కూడా అన్వేషిస్తోంది. అధిక జననాల రేటును ప్రోత్సహించడంతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గించాలని, ప్రైవేట్ ఆసుపత్రులలో సిజేరియన్ ప్రసవాల సంఖ్యను తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.
అయితే ఈ ప్రతిపాదనపై ప్రజల్లోని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పెరుగుతున్న విద్యా ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్ల వల్ల ఒక్క బిడ్డను పెంచడం కూడా కష్టంగా మారిందని పలువురు అంటున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


