రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ నోటిఫికేషన్ జారీ అయింది. 2026 - 2027 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ డిప్లోమా సీట్లను భర్తీ చేస్తారు.

ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ - 2026లో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీతో గడువు పూర్తవుతుంది. అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 100గా నిర్ణయించారు.
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా పాలిసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవటానికి అర్హులవుతారు.
ఏప్రిల్ 25న పాలిసెట్ ఎగ్జామ్….
ఏపీ పాలిసెట్ - 2026 పరీక్షలను ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తారు. అంతకంటే ముందే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు. ఎగ్జామ్ నిర్వహణకు 7 రోజుల ముందు వీటిని విడుదల చేస్తారు. పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రాథమిక కీలను ప్రకటిస్తారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత తుది కీలతో పాటు ఫలితాలను ప్రకటిస్తారు.
అభ్యర్థులు సాధించిన ర్యాంకులతో పాటు వారు ఎంచుకున్నవెబ్ ఆప్షన్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు టాప్ కాలేజీల్లో సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. విడతల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి… అడ్మిషన్ల భర్తీని పూర్తి చేస్తారు.
ఏపీ పాలిసెట్ - అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా https://polycetap.ap.gov.in/Default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
- హోం పేజీలోని ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్ లేదా పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్ ను పొందొచ్చు.