AP POLYCET Counseling 2026 : పాలిటెక్నిక్ కళాశాలల్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఏపీ పాలిసెట్ (AP POLYCET) రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్లో భాగంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియను సోమవారం విజయవంతంగా పూర్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే…. ప్రస్తుతం 55 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 257 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉండగా, వీటిలో కన్వీనర్ కోటా కింద మొత్తం 79,873 సీట్లు కేటాయించారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా ఇప్పటివరకు 44,254 సీట్లు భర్తీ కాగా…. ఇంకా 35,619 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇక ఫైనల్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు…. ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్, సెల్ఫ్ జాయినింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ పాలిసెట్ ప్రవేశ పరీక్షలో మొత్తం 1,48,951 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిలో 46,578 మంది మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తుది పరిశీలన అనంతరం వీరిలో 45,748 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అర్హత పొందారు. దీంతో భారీగానే సీట్లు మిగిలిపోయాయి.
అలాట్మెంట్ డౌన్లోడ్ విధానం:
ఏపీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ లో సీటు పొందిన అభ్యర్థులు తమ అలాట్మెంట్ ఆర్డర్ను ఆన్లైన్ ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక వెబ్సైట్ https://polycet.ap.gov.in ను సందర్శించాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Login' ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- మీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వివరాలు నమోదు చేశాక 'సబ్మిట్ ' బటన్పై క్లిక్ చేస్తే స్క్రీన్పై మీ సీటు కేటాయింపు వివరాలు కనిపిస్తాయి.
- భవిష్యత్ అవసరాల కోసం ఆ కాపీని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తిస్తుంది. అయితే దీనికి సంబంధించి వయోపరిమితి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. జూలై 1, 2026 నాటికి ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లుగా నిర్ణయించారు. అలాగే ఓసీ (OC) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లుగా ఉంది. ఈ వయోపరిమితి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం వర్తిస్తుంది. అయితే దీనికి సంబంధించి వయోపరిమితి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. జూలై 1, 2026 నాటికి ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 24 ఏళ్లుగా నిర్ణయించారు. అలాగే ఓసీ (OC) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 20 ఏళ్లుగా ఉంది. ఈ వయోపరిమితి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
{{/usCountry}}