ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీలో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పిస్తారు. అంతేకాకుండా 6,7,8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను కూడా భర్తీ చేస్తారు.

5వ తరగతిలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 4వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన విద్యార్థులు https://aprs.apcfss.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్ లో భాగంగా ఒక మొబైల్ నెంబర్ ను ఒక్క దరఖాస్తుకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఆధారంగా ఓటీపీ నిర్ధారించబడుతుంది. అప్లికేషన్ లో విద్యార్థి పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. విద్యార్థి ఫొటో, సంతకాన్ని కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నమోదులో తప్పులుంటే ఇబ్బందులు వస్తాయని… ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సొసైటీ ఎంట్రెన్స్ టెస్ట్ ను ఏప్రిల్ 24వ తేదీ నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 2 గంటల సమయం ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ,పరిసరాల విజ్ఞానం వంటి విభాాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. త్వరలోనే హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా…
- ముందుగా https://aprs.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని 5వ తరగతి అడ్మిషన్ లింక్ పైక్లిక్ చేయాలి.
- ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ఇక్కడ విద్యార్థి పేరు ,ఆధార్ పేరు, పుట్టిన తేదీ, కమ్యూనిటీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిస్థాయి అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
- మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి. సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందాలి.