భూముల రీసర్వేపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఘాటుగా స్పందించారు. రీ సర్వేను 2018లోనే జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తు చేశారు. అప్పుడే రీ సర్వేను అత్యాధునిక టెక్నాలజీతో చేసేందుకు ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తీసుకువస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తానే రీ సర్వేను కనిపెట్టినట్లు క్రిమినల్ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత జగన్ కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వేను పూర్తిగా తప్పుల తడకగా నిర్వహించిందన్నారు. అందుకే ప్రజలు రీ సర్వే పై తమ ప్రభుత్వానికి 2.7 లక్షల ఫిర్యాదులు చేశారని చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను అడ్డం పెట్టుకొని ప్రజల భూములను భక్షించేందుకు వీలుగా రీ సర్వేను నీరు కార్చారన్నారు. అందువల్లే గత ప్రభుత్వ రెవెన్యూ పాపాలపై 70 శాతం ప్రజల నుండి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతలకు భూములు అమ్మనివారని బెదిరించేందుకు ఆ భూములన్నీ 22ఎ నిషేధిత జాబితాలో పెట్టారని విమర్శించారు.
ప్రచార పిచ్చి కోసం సర్వే రాళ్లపై, పాస్ పుస్తకాలపై తన బొమ్మలు ముద్రించుకునేందుకు 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని మంత్రి అనగాని దుయ్యబట్టారు. ప్రజా ధనాన్ని సొంత ప్రచారం కోసం ఖర్చు చేసే అధికారం జగన్ కు ఎక్కడదని ప్రశ్నించారు. పాస్ పుస్తకాలను కూడా తప్పుల తడకగా ప్రచురించారని, తన బొమ్మ, భూమికి సంబంధించిన ఒకటి రెండు వివరాలు తప్ప ఏ ఒక్కటీ అందులో సరిగ్గా లేదని అన్నారు. తాము రాజముద్రతో పాస్ పుస్తకం ఇచ్చామని, అందులో దాదాపు 15కు పైగా భద్రతా అంశాలను జోడించి ఇచ్చామని చెప్పారు.
అర్బన్ ప్రాంతంలో భూముల విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట రేట్ల పెంపుదలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
{{/usCountry}}అర్బన్ ప్రాంతంలో భూముల విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న చోట రేట్ల పెంపుదలపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
{{/usCountry}}