AP RGUKT IIIT Results 2026 :ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ మెరిట్ జాబితా అధికారికంగా విడుదలైంది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫలితాల వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలోని నూజివీడు, ఒంగోలు, ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ), శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో ఆరేళ్ల సమీకృత (ఇంటిగ్రేటెడ్) బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం ఈ అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం విద్యార్థుల నుంచి భారీ స్థాయిలోనే దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 44,104 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి శనివారం నాడు 4,040 మంది అభ్యర్థులను ప్రాథమికంగా ఎంపిక చేశారు.
ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన మొత్తం విద్యార్థుల్లో ఏకంగా 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారేనని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల అభ్యర్థులు ప్రతిభ కనబరచడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులందరికీ ఆయన తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - ఇలా చెక్ చేసుకోండి:
అభ్యర్థులు తమ ప్రొవిజనల్ సెలక్షన్ వివరాలను ఆర్జీయూకేటీ అధికారిక వెబ్సైట్లోకి ( http://rgukt.in ) వెళ్లి పరిశీలించుకోవచ్చు. వెబ్సైట్లో విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునే వీలుంటుంది.
డిజిటల్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఈసారి వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకునే వినూత్న సదుపాయాన్ని అధికారులు కల్పించారు. దీనికోసం విద్యార్థులు 9552300009 నంబర్కు వాట్సప్ మెసేజ్ పంపి, అందులో 'ఎడ్యుకేషన్ సర్వీసెస్' విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత 'ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్' (RGUKT Admissions 2026 Results) ఆప్షన్పై క్లిక్ చేసి, తమ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
జూలై 1 నుంచే తరగతులు…
{{/usCountry}}డిజిటల్ సేవలను మరింత సులభతరం చేస్తూ ఈసారి వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా ఫలితాలను చెక్ చేసుకునే వినూత్న సదుపాయాన్ని అధికారులు కల్పించారు. దీనికోసం విద్యార్థులు 9552300009 నంబర్కు వాట్సప్ మెసేజ్ పంపి, అందులో 'ఎడ్యుకేషన్ సర్వీసెస్' విభాగాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత 'ఆర్జీయూకేటీ అడ్మిషన్స్ 2026 రిజల్ట్స్' (RGUKT Admissions 2026 Results) ఆప్షన్పై క్లిక్ చేసి, తమ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
జూలై 1 నుంచే తరగతులు…
{{/usCountry}}మరోవైపు ఎంపికైన అభ్యర్థులకు కొత్త విద్యా సంవత్సరం తరగతుల నిర్వహణపై ఆర్జీయూకేటీ స్పష్టత ఇచ్చింది. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లలో కొత్త బ్యాచ్ (పీయూసీ-1) తరగతులు జులై 1 నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరంలో జులై 15 నుంచి తరగతులు మొదలుకాగా, ఈసారి విద్యార్థులకు నష్టం జరగకుండా 15 రోజుల ముందుగానే క్లాసులు స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. కాగా…. క్యాంపస్లలో ప్రస్తుతం చదువుతున్న పాత విద్యార్థులకు మాత్రం జూన్ 29 నుంచే విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.