Andhra Pradesh State Eligibility Test Result : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించిన 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష' (AP SET ) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను మే 30వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఏపీ సెట్ పరీక్షను ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించింది. మార్చి 28, 29 తేదీల్లో జరిగిన ఈ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా… అభ్యంతరాలను కూడా స్వీకరించారు. కానీ ఇంకా ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. దీంతో ఈ రిజల్ట్స్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సెట్ ఫలితాలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ నేల 30వ తేదీన విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అదే రోజు ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, మెరిట్ జాబితాను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
ఏపీ సెట్ ఫలితాలు చెక్ చేసుకోవటం ఎలా..?
- మొదట ఏపీ సెట్ అధికారిక వెబ్సైట్ apset.net.in ను సందర్శించాలి.
- హోం పేజీలో కనిపించే “APSET Result / Scorecard” లింక్పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి తమ హాల్ టికెట్ నంబర్ (లేదా రిజిస్ట్రేషన్ నంబర్) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.
- వివరాలు సమర్పించిన తర్వాత మీ స్క్రీన్పై ఏపీ సెట్ స్కోర్కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
- భవిష్యత్తు అవసరాల కోసం స్కోర్కార్డ్ను ప్రింట్ అవుట్ తీసి భద్రపరుచుకోవాలి.
యూజీసీ నిబంధనల ప్రకారం…. పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లు కలిపి జనరల్ (OC) మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwD), థర్డ్ జెండర్ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తేనే పరీక్షలో అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
{{/usCountry}}యూజీసీ నిబంధనల ప్రకారం…. పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్లు కలిపి జనరల్ (OC) మరియు ఈడబ్ల్యూఎస్ (EWS) కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwD), థర్డ్ జెండర్ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధిస్తేనే పరీక్షలో అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. ఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఏపీలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
{{/usCountry}}