AP TET Mock Tests : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ అందించింది. పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఆన్లైన్ పరీక్షా విధానంపై పట్టు సాధించేందుకు వీలుగా అధికారిక వెబ్సైట్లో ఉచిత మాక్ టెస్టుల ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయం ద్వారా అభ్యర్థులు ఎగ్జామ్ పాటర్న్ను అర్థం చేసుకోవడంతో పాటు టైం మేనేజ్మెంట్ను ప్రాక్టీస్ చేయవచ్చు.
ఉచిత మాక్ టెస్ట్ ఎలా రాయాలంటే?

టెట్ అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈ మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయవచ్చు.
- మొదటగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/# లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపిస్తున్న 'మాక్ టెస్ట్ (Mock Test) అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- వెంటనే స్క్రీన్పై మొత్తం 13 సబ్జెక్టులకు సంబంధించిన లింకులు విడివిడిగా కనిపిస్తాయి.
- అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టుకు ఎదురుగా ఉన్న క్లిక్ హియర్ లింక్ను ఎంచుకోవాలి.
- ఈ మాక్ టెస్ట్ రాయడానికి ఎలాంటి యూజర్ ఐడీ లేదా పాస్వర్డ్ అవసరం లేదు. నేరుగా 'సైన్-ఇన్' బటన్ నొక్కి ఉచితంగా పరీక్షను ప్రారంభించవచ్చు.
ఈ మాక్ టెస్టులు రాయడం వల్ల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఎలా ఉంటుందో అభ్యర్థులకు ముందే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలము అనే విషయాన్ని కూడా అభ్యర్థులు స్వయంగా విశ్లేషించుకోవచ్చు.
ఆగస్టు 5 నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు
విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభించి, ఆగస్టు 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer Based Test) పద్ధతిలో రోజుకు రెండు సెషన్ల చొప్పున వివిధ తేదీల్లో నిర్వహిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాల పరిశీలన, ప్రాథమిక కీ (Initial Key) విడుదల, ఆ కీపై అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను విద్యాశాఖ అత్యంత వేగంగా పూర్తి చేయనుంది. అన్ని రకాల పరిశీలనలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.
{{/usCountry}}పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాల పరిశీలన, ప్రాథమిక కీ (Initial Key) విడుదల, ఆ కీపై అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాల స్వీకరణ వంటి ప్రక్రియలను విద్యాశాఖ అత్యంత వేగంగా పూర్తి చేయనుంది. అన్ని రకాల పరిశీలనలు ముగిసిన తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ టెట్ తుది ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారు.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో (DSC) టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే టెట్లో సాధించే ప్రతి మార్కు అభ్యర్థుల ఉపాధ్యాయ కొలువు కలని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే అభ్యర్థులు ఈ పరీక్షను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు.