Andhrapradesh Weather Alert : ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లీ వర్ష మేఘాలు కమ్ముకొస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉంది.ప్రజలంతా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాలు కురిసే జిల్లాలు:

అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో వర్షాలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో రోజంతా మేఘావృతమైన వాతావరణం నెలకొనడంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వర్షాలతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తీవ్ర అప్రమత్తత పాటించాలి. ఉరుములు, మెరుపులు వస్తున్న సమయంలో బయట తిరగకూడదని అధికారులు స్పష్టం చేశారు. "పిడుగులు పడే సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద చెట్ల కింద, ఇనుప స్తంభాల (ఐరన్ పోల్స్) వద్ద లేదా ప్రకటనల హోర్డింగ్స్ కింద నిలబడకూడదు," అని హెచ్చరించారు. సురక్షితమైన కాంక్రీటు భవనాల లోపల మాత్రమే ఆశ్రయం పొందాలని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ కోరారు.
తక్షణ హెచ్చరిక….
రాబోయే మూడు గంటల వ్యవధిలో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా సాలూరు, బొబ్బిలి, శృంగవరపుకోట (ఎస్.కోట), విజయనగరం పట్టణం, రాజాం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
{{/usCountry}}రాబోయే మూడు గంటల వ్యవధిలో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా సాలూరు, బొబ్బిలి, శృంగవరపుకోట (ఎస్.కోట), విజయనగరం పట్టణం, రాజాం పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఆయా ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.
{{/usCountry}}