...
...
Next Story

APMSRB Recruitment 2026 : వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగాలు - దగ్గరపడిన గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

APMSRB Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. 529 స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు రేపటితో ముగియనుంది.

Published on: Jun 29, 2026, 06:12:12 IST
Advertisement

APMSRB Recruitment Notification 2026 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ ఖాళీలున్నాయి. అన్ని ఉద్యోగాలు కలిపి 529 ఉండగా… ఈ పోస్టులకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు రేపటితో (జూన్ 30) ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

మొత్తం 529 ఖాళీలు - వివరాలు :

  • స్టాఫ్ నర్స్ : మొత్తం 419 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 27,675 వేతనం అందిస్తారు. అభ్యర్థులు బీఎస్‌సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (GNM) కోర్సు పూర్తి చేసి… ఏపీ నర్సింగ్ కౌన్సిల్ (APNMC)లో తాజాగా నూతనీకరించిన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
  • ఫార్మసిస్ట్ : మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. వీరికి నెలకు రూ. 23,393 వేతనం లభిస్తుంది. అభ్యర్థులు డి.ఫార్మా లేదా బి.ఫార్మా లేదా ప్రభుత్వం గుర్తించిన ఇంటర్మీడియట్ వోకేషనల్ ఫార్మసీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
  • మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్) : మొత్తం 86 ఖాళీలు ఉన్నాయి. వీరికి నెలకు రూ. 23,494 వేతనం చెల్లిస్తారు. ఇంటర్మీడియట్ విద్యతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏడాదిన్నర కాలపరిమితి గల మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి, ఆర్సీఐ చట్టం-1992 (RCI Act) కింద రిజిస్టర్ అయి ఉండాలి.

వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగాలు
వైద్యారోగ్య శాఖలో 529 ఉద్యోగాలు

పోస్టుల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. పూర్తిగా మెరిట్, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ఆధారంగానే ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేస్తారు.

దరఖాస్తు విధానం ఇలా:

  • అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in/msrb/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 30, 2026 (రాత్రి 11:59 గంటల వరకు).
  • దరఖాస్తు రుసుము : ఓపెన్ కాంపిటీషన్ (OC) అభ్యర్థులు రూ. 1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (EWS) మరియు దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 900 గా నిర్ణయించారు. రుసుమును ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
  • సాంకేతిక సమస్యలు ఎదురైతే పనిదినాల్లో ఉదయం 11:00 నుండి సాయంత్రం 4:00 గంటల మధ్య 94926 19809 నంబర్‌ను సంప్రదించవచ్చు.
  • అధికారిక వెబ్ సైట్ - https://apmsrb.ap.gov.in/msrb/

ఈ లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe