APMSRB Recruitment : వైద్యారోగ్యశాఖలో 47 ఉద్యోగ ఖాళీలు - నెలకు రూ. 80 వేల జీతం, చివరి తేదీ ఎప్పుడంటే..?
APMSRB Recruitment 2026 : ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APMSRB) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. దరఖాస్తుకు జూన్ 17 చివరి తేదీ.
APMSRB Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (DSH) నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేయడానికి 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 3వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 2026 జూన్ 17వ తేదీ రాత్రి 11:59 గంటలలోపు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు. https://apmsrb.ap.gov.in/msrb వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫీజు చెల్లింపుతో పాటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు :
- మొత్తం 47 హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులలో పాత నోటిఫికేషన్ల బ్యాక్లాగ్ ఖాళీలతో పాటు రెగ్యులర్ ఖాళీలు కూడా కలిసి ఉన్నాయి. ఇందులోనూ ఓపెన్ కేటగిరీ కింద 18 ఖాళీలున్నాయి.
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఎంబీబీఎస్ (MBBS) లేదా ఎండీఎస్ (MDS) బేసిక్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు తప్పనిసరి విద్యార్హతగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హాస్పిటల్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా హెల్త్ సెక్టార్ క్వాలిటీ మేనేజ్మెంట్లో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉండాలి. వీటితో పాటు గుర్తింపు పొందిన సంస్థలలో అడ్మినిస్ట్రేషన్ లేదా లీడర్షిప్ లేదా మేనేజర్ రోల్స్లో కనీసం ఒక ఏడాది పని చేసిన అనుభవం ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో ప్రస్తావించారు.
- అభ్యర్థుల వయస్సు 2025 జూలై 1 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు (గరిష్ట వయస్సు 47 ఏళ్లు), దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు (గరిష్ట వయస్సు 52 ఏళ్లు) ఇచ్చారు. ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు వారి సేవ కాలంతో పాటు అదనంగా 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా రూ.80,000 చొప్పున స్థిర వేతనం (రెమ్యూనరేషన్) అందిస్తారు.
- అభ్యర్థుల ఎంపికను ప్రక్రియను 100 మార్కుల వెయిటేజీ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపంలో నిర్వహిస్తారు. ఎంబీబీఎస్/ఎండీఎస్ మార్కులకు గరిష్టంగా 45 మార్కులు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ డిగ్రీ/ఎంబీఏ మార్కులకు గరిష్టంగా 30 మార్కులు అభ్యర్థి డిగ్రీ పాసైన సంవత్సరం ఆధారంగా (సీనియారిటీ)కి గరిష్టంగా 10 మార్కులు కేటాయిస్తారు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా చేసిన కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజీకి గరిష్టంగా 15 మార్కులుంటాయి.
- దరఖాస్తు ఫీజు కింద ఓపెన్ కేటగిరీ (OC) అభ్యర్థులకు రూ.1500 ఎస్సీగా నిర్ణయించారు. ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.1000 చెల్లించాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://apmsrb.ap.gov.in/msrb/
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

