ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ల పరిశీలనకు తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

గత ఏడాది (2025) జూలై 15 నుండి జూలై 23 వరకు ఆన్లైన్ విధానంలో (CBT) నిర్వహించిన రాత పరీక్షల మార్కుల ఆధారంగా ఈ మెరిట్ జాబితాను రూపొందించారు. రాత పరీక్షలో అర్హత సాధించి, తదుపరి దశకు ఎంపికైన అభ్యర్థులకు జూలై 6, 2026 ఉదయం 10:00 గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అదే రోజున అభ్యర్థులకు తప్పనిసరి అయిన కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కూడా నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, స్థానికత సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, హాల్ టికెట్లతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల పూర్తి జాబితా, కాల్ లెటర్స్, ఇతర అప్డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.inను సందర్శించవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సర్వీస్లో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు ఈ కంప్యూటర్ టెస్ట్ (CPT) క్వాలిఫైయింగ్ పరీక్షగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయానికి విజయవాడ కార్యాలయానికి చేరుకోవాలని కమిషన్ కోరింది.
'అసలు ధృవపత్రాల పరిశీలన 2026 జూలై 6న ఉదయం 10 గంటలకు విజయవాడలోని APPSC కార్యాలయంలో జరుగుతుంది. అదే రోజున కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష (CPT) కూడా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు.' అని ప్రకటనలో తెలిపింది.
{{/usCountry}}'అసలు ధృవపత్రాల పరిశీలన 2026 జూలై 6న ఉదయం 10 గంటలకు విజయవాడలోని APPSC కార్యాలయంలో జరుగుతుంది. అదే రోజున కంప్యూటర్ ప్రావీణ్యత పరీక్ష (CPT) కూడా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు.' అని ప్రకటనలో తెలిపింది.
{{/usCountry}}