ఏపీఎస్ఆర్టీసీ టెంపుల్ టూరిజం ప్యాకేజీలు.. కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య

ఏపీఎస్ఆర్టీసీ పలు టూరిజం ప్యాకేజీలు నడుపుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య ప్యాకేజీలు ఉన్నాయి.

Published on: Dec 25, 2025 11:14 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీఎస్ఆర్టీసీ ఇటీవల అనేక పర్యాటక ప్యాకేజీలను రన్ చేస్తోంది. శబరిమల, అరుణాచలంలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది. టెంపుల్ టూరిజంలో భాగంగా అనే ప్యాకేజీలను నడుపుతోంది. కొత్త రూట్లలోనూ పర్యాటకులను తీసుకెళ్తోంది. భక్తులను ఆధ్యాత్మికత అనుభూతిని కలిగిస్తుంది. తాజాగా కర్ణాటక-మైసూరు, కాశీ-అయోధ్య పేరుతో టూర్ ప్యాకేజీలను తెచ్చింది ఆర్టీసీ. ఆ వివరాలు చూద్దాం..

అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం
అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహం

ఈ రెండు ప్యాకేజీలు మరికొన్ని రోజుల్లో మెుదలుకానున్నాయి. జనవరి 20వ తేదీన కర్ణాటక-మైసూరు, ఫిబ్రవరి 7న కాశీ-అయోధ్య యాత్రకు వెళ్లవచ్చు. ఈ బస్సులు రాజమహేంద్రవరం నుంచి బయలుదేరుతాయి. సాయంత్రం 4 గంటలకు ప్రయాణం మెుదలుకానుంది. ఇందుకోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులను ఉపయోగిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. బస చేసేందుకు గదులు తీసుకుంటే.. దానికి డబ్బులను పర్యాటకులే చూసుకోవాలి.

కర్ణాటక-మైసూరు యాత్ర.. తొమ్మిది రోజులు ఉంటుంది. ఇందులో శ్రీశైలం, రాజమండ్రి, మహానంది, మంత్రాలయం దర్శనాలు ఉంటాయి. ఆ తర్వాత అక్కడి నుండి కర్ణాటకలోకి వెళ్తారు. హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, కొల్లూరు, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్య, శ్రీరంగపట్నం, మైసూర్‌కు వెళ్తారు. ఈ యాత్రలో ఒక్కరికి రూ.11,500 ఛార్జీలు ఉంటాయి. భోజన సదుపాయంతో కలిపి ఈ ప్యాకేజీ అన్నమాట. అదనపు ఖర్చులను భక్తులే భరించాలి.

కాశీ-అయోధ్య యాత్ర 11 రోజులు ఉంటుంది. 13 పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఒడిశాలో మెుదటగా పూరి జనార్ధనుడి ఆలయం దర్శించుకుంటారు. తర్వాత కోణార్క్‌లోని సూర్యదేవాలయం, జాజ్‌పూర్, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం, కాశీ, అయోధ్య, నైమిశారణ్యం, గయ, బుద్ధగయను సందర్శించుకోవచ్చు. తర్వాత తిరిగి వస్తారు.

మహా శివరాత్రికి కాశీని దర్శించుకునేలా ఈ ప్లాన్ ఉంది. తిరిగి వచ్చే సమయంలో శ్రీకాకుళం అరసవల్లి, శ్రీకుర్మం, అన్నవరం క్షేత్రాలను సందర్శించి రావొచ్చు. రూ.13000 ప్యాకేజీ ధరగా నిర్ణయించారు. ఇందులో కూడా అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారాన్ని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తారు. ఈ ట్రిప్‌కు సంబంధించి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోను సంప్రదించవచ్చు.