అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ

పది అడుగుల ఎత్తైన ధర్మ ధ్వజాన్ని అయోధ్య రామ మందిరంపై ఎగురవేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం. ఈ పవిత్ర జెండా సూర్యుడు, 'ఓం', కోవిందార వృక్షం చిత్రాలను కలిగి ఉంది. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తైంది.

Published on: Nov 25, 2025 1:03 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యలోని రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఈ చర్యతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లుగా ప్రకటించారు. 'ధర్మ ధ్వజం' అని పిలిచే ఈ పది అడుగుల ఎత్తైన జెండాపై సూర్యుని చిత్రం, 'ఓం' అక్షరాలు, కోవిందార వృక్షం చిత్రం ఉన్నాయి.

రామ మందిరంపై జెండా రెపరెపలు.. (Deepak Gupta/Hindustan Times)
రామ మందిరంపై జెండా రెపరెపలు.. (Deepak Gupta/Hindustan Times)

ఈ పవిత్ర జెండా గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపు సందేశాన్ని అందిస్తుందని, ఇది రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది అని ప్రధానమంత్రి కార్యాలయం ముందుగా ఒక ప్రకటనలో తెలిపింది.

ముఖ్య అతిథులు, రామరాజ్యం ఆదర్శాలు

తొలుత, ప్రధాని మోదీ మంగళవారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలోని రామ్ లల్లా గర్భ గృహంలో పూజలు నిర్వహించారు. అలాగే, ఆయన మాత అన్నపూర్ణ మందిరం, సప్తమందిరంలో కూడా ప్రార్థనలు చేశారు. సప్తమందిరంలో మహర్షి వశిష్ఠుడు, మహర్షి విశ్వామిత్రుడు, మహర్షి అగస్త్యుడు మహర్షి వాల్మీకికి సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి. ఆ తర్వాత జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ ఆలయం "140 కోట్ల మంది భారతీయుల విశ్వాసానికి, ఆత్మగౌరవానికి ప్రతీక" అని అన్నారు. "ఈ జెండా ధర్మానికి ఉన్న కాంతి శాశ్వతమని, రామరాజ్య సూత్రాలు కాలాతీతమైనవని రుజువు చేస్తుంది," అని ఆయన జోడించారు.

అభిజిత్ ముహూర్తంలో జెండా ఆవిష్కరణ

హిందువులు పవిత్రమైనదిగా భావించే 'అభిజిత్ ముహూర్తం' (గ్రహాల శుభ సముదాయం)లో జెండా ఆవిష్కరణ జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ఈ వేడుక రామమందిర నిర్మాణాన్ని అధికారికంగా పూర్తి చేసినట్లు సూచిస్తుందని చెప్పారు.

సూర్యుడు ఉదయించడానికి ప్రతీకగా ఈ జెండా నిలుస్తుందని, ఇది త్యాగం, అంకితభావానికి సంకేతం అని ఆయన వివరించారు.

ప్రతి ఆరు నెలలకు జెండా మార్పు

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ జెండాను సంవత్సరానికి రెండుసార్లు—వసంత, శరదృతువు నవరాత్రుల సమయంలో మార్చాలని నిర్ణయించింది. ఈ జెండాను ప్రత్యేకమైన పారాచూట్ ఫ్యాబ్రిక్, పట్టు దారాలతో తయారు చేశారని, ఇది ఎండ, వర్షం, బలమైన గాలులను తట్టుకోగలదని ట్రస్ట్ చెప్పింది.

2024 లోక్​సభ ఎన్నికలకు ముందు, జనవరిలో ప్రధాని మోదీ ఆలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

News/News/అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ
News/News/అయోధ్య రామ మందిరంపై 'ధర్మ ధ్వజం' ఎగురవేసిన ప్రధాని మోదీ