ఏపీఎస్ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలు.. త్వరలో రానున్న నోటిఫికేషన్!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్నవారి కోసం అదిరిపోయే వార్త. ఏపీఎస్ఆర్టీసీ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీలో కొలువుల జాతర మెుదలుకానుంది. పెద్ద ఎత్తున ఏపీఎస్ఆర్టీసీలో రిక్రూట్మెంట్ జరగనుంది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. ఆర్టీసీలో ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక అందింది. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మెుదలుకానుంది. అంతేకాదు ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల్లో కొందరికి జీతాలు కూడా పెరగనున్నాయి.

ఏపీఎస్ఆర్టీసీ మెుత్తం 7673 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. ఇందులో 3673 మంది డ్రైవర్ల్ పోస్టులు ఉన్నాయి. 1813మంది కండక్టర్లు, ఆ తర్వాత మెకానిక్, శ్రామిక్తోపాటుగా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. ఆయా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వాన్ని ఆర్టీసీ అనుమతి కోరింది. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు నోటిఫికేషన్ వెలువడనుంది.
ఇక ప్రస్తుతం సర్వీస్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు కూడా ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ఆన్ కాల్ డ్రైవర్లకు రోజువారీ వేతనం 800 నుంచి 1000కి పెంచుతున్నారు. అంతేకాదు డబుల్ డ్యూటీ కండక్టర్లకు 900కు పెంచుతారు.
మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆర్టీసీపై ఒత్తిడి పడుతోంది. ఇప్పుడు చేపట్టబోయే ఖాళీల భర్తీతో పెద్ద ఎత్తున ఉపశమనం దక్కనుంది. ఇప్పటికే చాలాసార్లు ఉద్యోగ సంఘాలు ఖాళీల భర్తీ కోసం డిమాండ్ చేశాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ నియమకాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం ప్రణాళికలు అమలుచేస్తూనే ఉంది. మెున్నటిమెున్న సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పండగకు ఇంటికి వచ్చేవారి కోసం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక బస్సుడు ఆపరేట్ చేసింది. అంతేకాదు జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.27.68 కోట్లతో అత్యధిక ఆదాయాన్ని సంపాదించింది. ఇది కార్పొరేషన్ చరిత్రలోనే అత్యధికం. ఆ రోజున ఆర్టీసీ బస్సుల్లో 50.6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


