హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. లక్షా 80 వేల వరకు జీతం.. అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్(MANAGE) హైదరాబాద్‌ పలు పోస్టులకు రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jan 27, 2026, 14:22:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్(MANAGE)లో పలు ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మేనేజ్‌లో ఉద్యోగాలు
మేనేజ్‌లో ఉద్యోగాలు

3 అసిస్టెంట్ డైరెక్టర్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి, అభ్యర్థులు సంబంధిత రంగంలో తగిన పని అనుభవంతో పాటు పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ (వ్యవసాయ విస్తరణ / వ్యవసాయ ఆర్థిక శాస్త్రం / వ్యవసాయ వ్యాపార నిర్వహణ / మానవ వనరుల నిర్వహణ) లేదా పీహెచ్‌డీ కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణత కావాలి. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది.

జీతం నెలకు రూ.57,700-రూ.1,82,400 మధ్య ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రాత పరీక్ష 100 మార్కులు (100 ప్రశ్నలు) (పార్ట్-ఎ: 50 మార్కులు & పార్ట్-బి: 50 మార్కులు)కుఉంటుంది. వ్యాస రచన: 20 మార్కులు, ప్రజెంటేషన్: 10 మార్కులు, ఇంటర్వ్యూ: 20 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మార్కులు 150.

రాత పరీక్ష: 100 మార్కులు (100 ప్రశ్నలు) – ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో i) పార్ట్ ఎ – సాధారణ వ్యవసాయం – 50 మార్కులు, ii) పార్ట్ బి – సబ్జెక్ట్ స్పెషలైజేషన్ – 50 మార్కులు, iii) ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది, తప్పు సమాధానాలకు 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

మొదటి దశలో ఉత్తీర్ణులైన మొదటి 5 (1:5) మంది అభ్యర్థులను రెండో దశ పరీక్షకు పిలుస్తారు. ఇందులో i) వ్యాస రచన: 20 మార్కులు, ii) ప్రజెంటేషన్: 10 మార్కులు, iii) వ్యక్తిగత ఇంటర్వ్యూ: 20 మార్కులు ఉంటాయి. మొదటి మరియు రెండవ దశలలో అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.

దరఖాస్తుదారులు రూ.1000 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఈ రుసుము తిరిగి చెల్లించరు. దీనిని ఏదైనా జాతీయ బ్యాంకు నుండి "MANAGE" పేరు మీద, హైదరాబాద్‌లో చెల్లించదగిన డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు, ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు ఫారంతో పాటు దరఖాస్తు రుసుమును సమర్పించాలి.

వైకల్యం ఉన్న వ్యక్తులు (PwBD), మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500/- చెల్లించాలి. ఈ అభ్యర్థులు తమ కేటగిరీ పత్రాలను సమర్పించాలి. అనుభవం, వయస్సు, విద్యార్హతలు 2026 జనవరి 01వ తేదీ నాటికి పరిగణిస్తారు. ఫిబ్రవరి 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చదవండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More