...
...
Next Story

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో పానిక్ బటన్లు.. ఇవి ఎందుకోసం అంటే?

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో పానిక్ బటన్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉండనుంది.

Published on: May 17, 2026, 14:56:49 IST
Advertisement

ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి అన్ని ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలు, అత్యవసర హెచ్చరిక బటన్లను తప్పనిసరి చేస్తూ భారత సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) తన అన్ని బస్సుల్లో పానిక్ బటన్లను ఏర్పాటు చేయనుంది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన సుమారు 11,000 బస్సుల సముదాయంలో ఇప్పటికే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (EPOS) టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా జీపీఎస్-ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇప్పుడు సంస్థ వాహనాలన్నింటిలో అత్యవసర పానిక్ బటన్లను జోడించాలని యోచిస్తోంది.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

బస్సు రకాన్ని బట్టి డ్రైవర్లు లేదా కండక్టర్లచే నిర్వహించే ఈపీఓఎస్ యంత్రాలు, ప్రస్తుతం లైవ్ బస్ ట్రాకింగ్, టిక్కెట్ల జారీ, ముందస్తు రిజర్వేషన్, డిజిటల్ చెల్లింపులతో సహా పలు విధులకు ఉపయోగించబడుతున్నాయి. ఈ వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలోని సెంట్రల్ కమ్యూనికేషన్ సెల్‌కు బస్సు వేగాన్ని పర్యవేక్షించడానికి, లొకేషన్‌లను ట్రాక్ చేయడానికి, ప్రమాద సంబంధిత డేటాను విశ్లేషించడానికి కూడా వీలు కల్పిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

అత్యవసర లేదా అసురక్షిత పరిస్థితులలో ప్రయాణికులు హెచ్చరించేందుకు వీలుగా ప్రతి బస్సులో ఎమర్జెన్సీ బటన్లను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎంవై దానం తెలిపారు.

జనవరి 1, 2026 నుంచి అన్ని కొత్త ప్రజా రవాణా వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైసెస్ (VLTDs) ను తప్పనిసరిగా అమర్చాలని రవాణా శాఖ అధికారులు తెలిపారు. మే 1, 2026 నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ల పునరుద్ధరణ సమయంలో పాత వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు బస్సు సిబ్బందిని, ఆర్టీసీ అధికారులను, పోలీసులను అప్రమత్తం చేయడానికి పానిక్ బటన్లు వీలు కల్పిస్తాయని, తద్వారా వేగవంతమైన స్పందన, సహాయక చర్యలు చేపట్టవచ్చని అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe