ఫిబ్రవరి 4వ తేదీన ఈ జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెగా జాబ్ మేళాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ప్రముఖ కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూల్లో పాల్గొని జాబ్ పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC) ఫిబ్రవరి 04, 2026 నాడు శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మెగా జాబ్ మేళాలను ప్రకటించింది. ఈ మేళాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.

హిందూపురంలో జాబ్ మేళా ఎస్డీజీఎస్ డిగ్రీ, ఎంబీఏ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి జరుగుతుంది. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పోస్టర్ను విడుదల చేసి, అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, డాక్టర్ రెడ్డీస్, అపోలో ఫార్మసీ, బిగ్బాస్కెట్, ఫెమ్మవీ గ్రూప్, ఏసీటీతో సహా సుమారు 12 బహుళజాతి కంపెనీలు పాల్గొని, అక్కడికక్కడే ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.
ఎస్ఎస్సీ నుండి పీజీ, బీటెక్ వరకు విద్యార్హతలు కలిగిన 18-35 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులుగా పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.10,000 నుండి రూ.25,000 వరకు జీతాలు ఆశించవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఇక రాయచోటిలోని జాబ్ మేళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అశోక్ లేలాండ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొంటాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు.
దరఖాస్తుదారులు తమ విద్యార్హత పత్రాల జిరాక్స్లు, ఆధార్ కార్డు, ఫోటోలతో హాజరు కావాలని ఏపీఎస్ఎస్డీసీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


