APSSDC : ఐటీఐ, డిప్లోమా, డిగ్రీతో జర్మనీలో ఉద్యోగాలు.. భారీ జీతం, ఈ నెంబర్లకు కాల్ చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ యువతకు గుడ్న్యూస్ చెప్పింది. జర్మనీలో ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC), ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(OMCAP) భాగస్వామ్యంతో, ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్ల కోసం జర్మనీలో నైపుణ్యం ఆధారిత ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి ఒక అంతర్జాతీయ ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

తాజాగా విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఏపీఎస్ఎస్డీసీ ఏలూరు జిల్లా అధికారి జితేంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుండి అనుభవం ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ టెక్నీషియన్లకు విదేశాలలో ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమం కింద ఎలక్ట్రీషియన్ సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ అర్హతలు కలిగి కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉన్న పురుష, మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థుల వయస్సు 43 సంవత్సరాలలోపు ఉండాలి. వారికి ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. ఈ ఉద్యోగాలు రెండేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన అందిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు భారీ జీతం లభించనుంది. దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్, విద్యా ధృవపత్రాలు (ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ), అనుభవ ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inఅనే అధికారిక పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం అభ్యర్థులు 9988853335 లేదా 8712655686 హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ నుండి నైపుణ్యం కలిగిన యువతకు అధిక వేతనం ఇచ్చే అంతర్జాతీయ ఉద్యోగాలను పొందేందుకు కొత్త మార్గాలను అందిస్తుంది. అదే సమయంలో రాష్ట్రం ఉనికిని విదేశాల్లో కూడా బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


