ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 2026 ఆగస్టు 27న భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. గిరిజన ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లోని అర్హులైన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాలో సుమారు 10 ప్రముఖ బహుళజాతి, స్వదేశీ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయనున్నాయి. మొత్తం 595 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. ఫార్మా, ఆటోమొబైల్, రీటైల్, ఐటీ, లాజిస్టిక్స్, సేవా రంగాలకు చెందిన సంస్థలు తమ వద్ద ఉన్న ఉద్యోగ అవకాశాలను అభ్యర్థులకు అందించనున్నాయి.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులు తమ నైపుణ్యాలు, విద్యా అర్హతలకు తగిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు అర్హత, పోస్టును బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు ప్రారంభ వేతనం లభిస్తుంది.
ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు అందించేందుకు ఈ జాబ్ మేళా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అర్హత కలిగిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (DSDO) జి. ప్రశాంత్ కుమార్ కూడా మాట్లాడుతూ.. ఉద్యోగ వేటలో ఉన్న యువత ఎటువంటి ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో హాజరై తమ భవిష్యత్తును బంగారు బాటగా మలచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}అదేవిధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి (DSDO) జి. ప్రశాంత్ కుమార్ కూడా మాట్లాడుతూ.. ఉద్యోగ వేటలో ఉన్న యువత ఎటువంటి ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో హాజరై తమ భవిష్యత్తును బంగారు బాటగా మలచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}హాజరయ్యే అభ్యర్థులు APSSDC, అధికారిక Naipunyam పోర్టల్లో (naipunyam.ap.gov.in) తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తెచ్చుకోవాల్సిన పత్రాలు అప్డేట్ చేసిన రెజ్యూమ్, విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్ కాపీలు , ఇటీవల దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తేవాలి. ఈ జాబ్ మేళా ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని మంది యువకులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అర్హులైన నిరుద్యోగులు అందరూ తప్పక హాజరు కావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.